ETV Bharat / state

జ్ఞాన సమాజమే ధ్యేయంగా స్వేరోస్​: ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

author img

By

Published : Mar 29, 2021, 9:39 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో స్వేరోస్​ జ్ఞాన యుద్ధభేరి సభ జరిగింది. ముఖ్య అతిథిగా స్వేరేస్​ వ్యవస్థాపకులు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ పాల్గొన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు జీవితంలో అత్యున్నత స్థాయిల్లో ఉన్నారని ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.

sweros, rs praveen kumar
జ్ఞాన యుద్ధభేరి సభ, ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

కొందరు వ్యక్తులు తనపై పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్వేరోస్​ వ్యవస్థాపకులు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో జరిగిన స్వేరోస్​ జ్ఞాన యుద్ధభేరి సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు. నాటి గురుకులాలకు నేటి గురుకులాలకు తేడా గమనించాలని చెప్పారు.

జ్ఞాన సమాజం కోసం..

గురుకుల పాఠశాల విద్యార్థుల ఉన్నతి కోసం పూర్వ విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారని ఆయన అన్నారు. జ్ఞాన సమాజం కోసమే స్వేరోస్​ పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్రం విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ఎదగడమే స్వేరోస్ లక్ష్యమని చెప్పారు. పేద విద్యార్థులకు తమ వంతు చేయూతను అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేత సతీష్, సామాజిక కార్యకర్త అభిలాష రావు, బీసీ సంక్షేమ కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నోముల కుమారుడికే నాగార్జునసాగర్ టికెట్!

కొందరు వ్యక్తులు తనపై పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్వేరోస్​ వ్యవస్థాపకులు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో జరిగిన స్వేరోస్​ జ్ఞాన యుద్ధభేరి సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు. నాటి గురుకులాలకు నేటి గురుకులాలకు తేడా గమనించాలని చెప్పారు.

జ్ఞాన సమాజం కోసం..

గురుకుల పాఠశాల విద్యార్థుల ఉన్నతి కోసం పూర్వ విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారని ఆయన అన్నారు. జ్ఞాన సమాజం కోసమే స్వేరోస్​ పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్రం విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ఎదగడమే స్వేరోస్ లక్ష్యమని చెప్పారు. పేద విద్యార్థులకు తమ వంతు చేయూతను అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేత సతీష్, సామాజిక కార్యకర్త అభిలాష రావు, బీసీ సంక్షేమ కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నోముల కుమారుడికే నాగార్జునసాగర్ టికెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.