ETV Bharat / state

సర్కార్​ జాగాపై రియల్​ కన్ను - సర్కార్​ జాగాపై రియల్​ కన్ను

ప్రభుత్వ స్థలాలపై రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల కన్నుపడింది. అడ్డుగోలుగా భూములను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలోని 80 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు తమ పేరుతో పట్టా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

real estate businessmen occupied government land in nagar karnul district
సర్కార్​ జాగాపై రియల్​ కన్ను
author img

By

Published : Dec 15, 2019, 8:10 PM IST

సర్కార్​ జాగాపై 'రియల్​' కన్ను

హైదరాబాద్​కు చెందిన ఓ బడా వ్యాపారి నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలో కొంత భూమిని కొని, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. అది అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డులు పేర్కొంటున్నా కొనుగోలు పేరుతో రైతుల నుంచి 80 ఎకరాల ప్రభుత్వ భూమి లాక్కొన్నాడు. దర్జాగా తన భూ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆ భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

అక్రమ రిజిస్టేషన్లు

కుప్పగండ్ల గ్రామంలోని సర్వే నెంబర్లు 89, 90, 91, 92, 93 లో వంద ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో దాదాపు 80 ఎకరాల భూమిని భాగ్యనగరానికి చెందిన ఓ వ్యాపారి ఆక్రమించాడు. సర్వే నెంబర్లు 90, 92, 93 లో తన పేరున 7.23 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. అందులోని 33 గుంటల భూమిని ఇళ్ల స్థలాలుగా పేర్కొంటూ రికార్డుల్లో నమోదు చేయించాడు.

కౌలుకిచ్చి.. దృష్టి మరల్చి

ఈ సర్వే నంబర్లలోని భూమిలో 13.38 ఎకరాల భూమిని 11 మంది లబ్ధిదారుల పేరిట ఉన్న ఇళ్ల స్థలాలుగా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులోని అనుభవదారు కాలంలో నమోదు చేయించాడు. ఉన్నత అధికారుల దృష్టి మళ్లించేందుకు ఆ భూమిని స్థానిక రైతులకే కౌలుకిచ్చి పంటలను సాగు చేయిస్తున్నాడు. ఈ భూములకు మార్కెట్​లో ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ధర పలుకుతోంది.

నిబంధనలకు నీళ్లొదిలి
ఆక్రమణకు గురైన భూమిని స్థానికంగా ఉండే కొంతమంది గిరిజనులకు దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలుగా పంపిణీ చేసింది. అసైన్డ్ భూమిని కొనరాదు- అమ్మరాదంటూ నిబంధనలు పేర్కొంటున్నా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యాపారి పేరుపై కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేశారు.

గుట్టురట్టు

మిగతా భూమికి మ్యుటేషన్ చేయించుకునేందుకు ఆ వ్యాపారి అర్జి పెట్టుకోవడంతో ఈ వ్యవహారమంతా బయటపడగా... రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ప్రక్రియను నిలిపి వేశారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని వెల్దండకి బదిలీపై వచ్చిన నూతన తహసీల్దార్​ సైదులు తెలిపారు.

సర్కార్​ జాగాపై 'రియల్​' కన్ను

హైదరాబాద్​కు చెందిన ఓ బడా వ్యాపారి నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలో కొంత భూమిని కొని, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. అది అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డులు పేర్కొంటున్నా కొనుగోలు పేరుతో రైతుల నుంచి 80 ఎకరాల ప్రభుత్వ భూమి లాక్కొన్నాడు. దర్జాగా తన భూ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆ భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

అక్రమ రిజిస్టేషన్లు

కుప్పగండ్ల గ్రామంలోని సర్వే నెంబర్లు 89, 90, 91, 92, 93 లో వంద ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో దాదాపు 80 ఎకరాల భూమిని భాగ్యనగరానికి చెందిన ఓ వ్యాపారి ఆక్రమించాడు. సర్వే నెంబర్లు 90, 92, 93 లో తన పేరున 7.23 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. అందులోని 33 గుంటల భూమిని ఇళ్ల స్థలాలుగా పేర్కొంటూ రికార్డుల్లో నమోదు చేయించాడు.

కౌలుకిచ్చి.. దృష్టి మరల్చి

ఈ సర్వే నంబర్లలోని భూమిలో 13.38 ఎకరాల భూమిని 11 మంది లబ్ధిదారుల పేరిట ఉన్న ఇళ్ల స్థలాలుగా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులోని అనుభవదారు కాలంలో నమోదు చేయించాడు. ఉన్నత అధికారుల దృష్టి మళ్లించేందుకు ఆ భూమిని స్థానిక రైతులకే కౌలుకిచ్చి పంటలను సాగు చేయిస్తున్నాడు. ఈ భూములకు మార్కెట్​లో ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ధర పలుకుతోంది.

నిబంధనలకు నీళ్లొదిలి
ఆక్రమణకు గురైన భూమిని స్థానికంగా ఉండే కొంతమంది గిరిజనులకు దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలుగా పంపిణీ చేసింది. అసైన్డ్ భూమిని కొనరాదు- అమ్మరాదంటూ నిబంధనలు పేర్కొంటున్నా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యాపారి పేరుపై కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేశారు.

గుట్టురట్టు

మిగతా భూమికి మ్యుటేషన్ చేయించుకునేందుకు ఆ వ్యాపారి అర్జి పెట్టుకోవడంతో ఈ వ్యవహారమంతా బయటపడగా... రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ప్రక్రియను నిలిపి వేశారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని వెల్దండకి బదిలీపై వచ్చిన నూతన తహసీల్దార్​ సైదులు తెలిపారు.

Intro:tg_mbnr_12_27_sarkaru_jagapai_real_kannu_pkg_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని kuppagandla గ్రామం వివిధ సర్వే నంబర్లలో ఉన్న 80 ఎకరాల సర్కారు chaga పై రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వ భూమిని పట్టాదారు భూమిగా తమ పేరు పై చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

* 80 ఎకరాల సర్కారు జాగా పై రియల్ కన్ను...
- పాసు పుస్తకాలకు అధికారులపై ఒత్తిళ్లు
- మార్కెట్లో స్థలం విలువ రూపాయలు 25 కోట్లు
- రెవెన్యూ దస్త్రాల లో అసైన్డ్ గా గుర్తింపు.


Body:స్థిరాస్తి వ్యాపారం హైదరాబాదు నగరానికి అటుఇటు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీంతో సరిహద్దు భూముల ధరలకు రెక్కలొచ్చాయి స్థిరాస్తి వ్యాపారం చేసే కొంతమంది ఇదే అదునుగా పట్టా భూముల పక్కనున్న ప్రభుత్వ భూములను సొంతం చేసుకునే లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి కొంత భూమిని కొని, సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. అది అసైన్డ్ భూమి గా రెవెన్యూ రికార్డులు పేర్కొంటున్నా కొనుగోలు పేరుతో రైతుల నుంచి 80 ఎకరాల ప్రభుత్వ భూమి లాక్కొని దర్జాగా తన భూ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. ఈ భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటూ ఇప్పుడు ఆ స్థిరాస్తి వ్యాపారి అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడు.నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామపంచాయతీ పరిధిలో సాగుతున్న ఈ వ్యవహారమీది.

* కుప్ప గండ్ల గ్రామం లోని సర్వే నెంబర్లు 89,90, 91, 92, 93 లో వంద ఎకరాల అసైన్డ్ భూమి ఉంది ఇందులో దాదాపు 80 ఎకరాల భూమిని నగరానికి చెందిన ఓ వ్యాపారి ఆక్రమించారు. సర్వే నెంబర్లు 90, 92, 93 లో తన పేరున 7.23 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అందులోని 33 గుంటల భూమిని ఇళ్ళ స్థలాలుగా పేర్కొంటూ రికార్డుల్లో నమోదు చేయించారు, మరో 70 ఎకరాలకు పైగా భూమిని తన అధిక ఆధీనంలోనే ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అయితే లబ్ధిదారుల పేర్ల పైనే ఉంది. పైన పేర్కొన్న సర్వే నెంబర్లలో 11 మంది లబ్ధిదారుల పేర్ల ఉన్న 13.38 ఎకరాల భూమిని ఇళ్ళ స్థలాలుగా పేర్కొంటూ రెవెన్యూ రికార్డులోని అనుభవాదారు కాలంలో నమోదు చేయించారు. ఇలా రకరకాల రకాల జిమ్మిక్కులను ఉపయోగిస్తూ ప్రభుత్వ భూమిని ఆ వ్యాపారి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ అక్రమ వ్యవహారం నుంచి ఉన్నత అధికారుల దృష్టి మళ్లించేందుకు ఆ భూమిని స్థానిక రైతులకే కౌలుకిచ్చి పంటలను సాగు చేస్తున్నాడు. ఈ భూములకు మార్కెట్ లోఎకరం రూపాయలు 30 లక్షల నుంచి రూ 40 లక్షల మధ్య ధర పలుకుతోంది.


Conclusion:* నిబంధనలకు నీళ్లు వదిలారు :
ఆక్రమణకు గురైన భూమిని స్థానికంగా ఉండే కొంతమంది గిరిజనులకు దాదాపు 30 ఏళ్ల కిందట ప్రభుత్వం పట్టాలుగా పంపిణీ చేసింది అసైన్డ్ భూమిని కొనరాదు అమ్మ రాదంటూ నిబంధనలు పేర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యాపారి పేరుపై కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో 7.23 ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు సాగులో ఉన్న భూమిని ఇంటి స్థలాలు నమోదు చేశారు. ఇలా గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు నిబంధనలకు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన మిగతా భూమికి మ్యుటేషన్ చేయించుకునేందుకు ఆ వ్యాపారి ఆర్జి పెట్టుకోవడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. దీంతో వెల్దండ మండల రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ప్రక్రియను నిలిపి వేశారు. తహశీల్దార్ డిజిటల్ సంతకాన్ని పెండింగ్లో పెట్టారు.వెల్దo డ పూర్వ తహశీల్దార్ నాగ వీరేశం మాట్లాడుతూ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఉద్యోగం చేయాలంటే కత్తిమీద సాములా ఉందన్నారు, అసైన్డ్ భూములను చేయాలని ఓ వ్యక్తి ఆర్జి పెట్టుకుంటేకుదరదని అని పంపించాను అన్నారు. నాలుగు రోజుల క్రితం తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సైదులు మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

* నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.