ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే మర్రి పర్యటన - mla inspected rain crop loss in nagarkurnool

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా కురిసిన వానలకు పంట నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పరామర్శించారు. వరద ముంపునకు గురైన పంటలను గుర్తిస్తున్నామని.. నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

mla marri janardhan redy inspected  crop loss due to rains at nagar kurnool district
జిల్లా కేంద్రంలో నీట మునిగిన పంటలను పర్యటించిన ఎమ్మెల్యే మర్రి
author img

By

Published : Sep 19, 2020, 12:20 PM IST

గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు పంట నష్టం కలిగి అతలాకుతలమైన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి హామీ ఇచ్చారు. నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తాడూర్​ మండలంలోని లచ్చిరాం తండా, యాదిరెడ్డి పల్లి, ఎగంపల్లి, ఆకునెల్లికుదురు, మేడిపూర్​, అల్లపూర్​ గ్రామాల్లో పర్యటించి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు.

రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. కాలువులు, చెరువుల వద్ద బైక్​పై తిరుగుతూ వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద నీటిలో మునిగిన పత్తి, వరి పంటలను చూశారు. పంట నష్టంపై అధికారులు నివేదిక తయారుచేస్తున్నారని.. వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మర్రి హామీ ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు పంట నష్టం కలిగి అతలాకుతలమైన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి హామీ ఇచ్చారు. నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తాడూర్​ మండలంలోని లచ్చిరాం తండా, యాదిరెడ్డి పల్లి, ఎగంపల్లి, ఆకునెల్లికుదురు, మేడిపూర్​, అల్లపూర్​ గ్రామాల్లో పర్యటించి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు.

రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. కాలువులు, చెరువుల వద్ద బైక్​పై తిరుగుతూ వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద నీటిలో మునిగిన పత్తి, వరి పంటలను చూశారు. పంట నష్టంపై అధికారులు నివేదిక తయారుచేస్తున్నారని.. వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మర్రి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండిః శంకర్​పల్లిలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.