ETV Bharat / state

కూరగాయల మార్కెట్​ను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కూరగాయలు అమ్మే ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ... విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

author img

By

Published : Apr 25, 2020, 8:46 PM IST

MLA MARRI JANARDHAN REDDY DISTRIBUTED MASKS
కూరగాయల మార్కెట్​ను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. కూరగాయలు అమ్మే రైతులకు మాస్కులను పంపిణీ చేశారు.

కూరగాయలు ఎలా అమ్ముతున్నారు... ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని వారిని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమ్మాలని విక్రయదారులను కోరారు. కరోనా కారణంగా... భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరిగా వాడాలని సూచించారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. కూరగాయలు అమ్మే రైతులకు మాస్కులను పంపిణీ చేశారు.

కూరగాయలు ఎలా అమ్ముతున్నారు... ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని వారిని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమ్మాలని విక్రయదారులను కోరారు. కరోనా కారణంగా... భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరిగా వాడాలని సూచించారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిపారు.

ఇవీ చూడండి: మే 7 తర్వాత కరీంనగర్‌ కరోనా ఫ్రీ జోన్‌ : మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.