నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఆనందగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎడ్లు బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ బ్రహ్మోత్సవాలను ఊరంతా కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెంకటేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం తన క్యాంపు కార్యాలయంలో అజ్మీర్ షరీఫ్కు చాదర్ సమర్పించారు. రాష్ట్రంతో పాటు జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అజ్మీర్ షరీఫ్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో ప్రార్థించాలని ఆయన కోరారు. ముస్లింల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గల్ఫ్లో తగ్గుతున్న ఉపాధి... లక్షల మంది ఇంటి ముఖం