దసరాను పురస్కరించుకుని శమీ పూజ చేయడానికి వచ్చే భక్తుల కోసం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ను సుందరంగా ముస్తాబు చేశారు. బతుకమ్మ ఆడడం కోసం వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో అలంకరించారు. చెరువులో బతుకమ్మలు వదిలేందుకు కావల్సిన అన్ని ఏర్పాట్లను పురపాలిక సిబ్బంది పూర్తి చేశారు. బుద్ధ విగ్రహాన్ని రంగురంగుల లైట్లతో ముస్తాబు చేశారు.
అద్భత కాంతులతో రోజు ముందే పండుగ వాతావరణం నెలకొంది. దీనిని చూడడానికి పట్టణ ప్రజలు బారులు తీరారు. మినీ ట్యాంక్బండ్తో పాటు పట్టణంలోని ప్రధాన రహదారులను, స్తంభాలను ఎల్ఈడీ లైట్లతో అలంకరించి.. నాగర్కర్నూల్ పట్టణంలో ఆహ్లాదకర పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ నియంతృత్వ పోకడలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు'