రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని నాగర్కర్నూలు ఎంపీ రాములు కోరారు. కల్వకుర్తి మండలంలోని పంజుగుల, గుండూరు, లింగసానిపల్లి, రఘుపతిపేట గ్రామాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాటిన మొక్కలు.. వృక్షాలుగా మరే వరకు బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలు, రాజకీయాలకతీతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.