ETV Bharat / state

రియల్​ ఎస్టేట్​ దందా.. రెచ్చిపోతున్న కబ్జాదారులు!

author img

By

Published : Jul 20, 2020, 5:16 AM IST

నాగర్​కర్నూల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. చెరువులు, కుంటల సమీప భూములు కొనుగోలు చేసి... అవకాశం వచ్చిందే తడవుగా వాటిని ఆక్రమిస్తున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

governmanet pond lands grabbed in nagarkarnul
రెచ్చిపోతున్న కబ్జాదారులు.. ప్రభుత్వ భూములు స్వాహా!
రెచ్చిపోతున్న కబ్జాదారులు.. ప్రభుత్వ భూములు స్వాహా!

నాగర్​కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత... నాగనూల్​, ఎండబెట్ల, ఉయ్యాలవాడ, దేశి ఇటిక్యాల, నెల్లి కొండను నాగర్​కర్నూల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదునుగా చూసుకొని రియల్ వ్యాపారులు ఈ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న కుంటలు, చెరువు శిఖం భూములు కబ్జాలు చేస్తున్నారు. నాగనూల్ వద్ద ఉన్న పుట్నాల కుంటను భూబకాసురులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో 16.1 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట అలుగును గతేడాది డిసెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది.

కుంట సమీపంలో ఓ వ్యక్తి కొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసి... బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ భూమిని తవ్వి కట్టలు కట్టినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లికొండ సమీపంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణం ఉన్న చౌటకుంట కట్టను పూర్తిగా ధ్వంసం చేశారు. నాగర్​కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మించడం వల్ల ఆ భూమికి డిమాండ్ పెరిగింది. చుట్టుపక్కల భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. దీనికి ఆశపడి కొందరు రియల్ వ్యాపారులు దాదాపు 10, 11 నెలల క్రితమే కట్ట ఆనవాళ్లు లేకుండా చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కుంట గట్టును ధ్వంసం చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా అప్పుడు అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

నాగర్​కర్నూల్ నుంచి నాగనూల్ వెళ్లేదారిలో సర్వే నంబర్ 118 లోని 4.9 ఎకరాల విస్తీర్ణంలో సబర్ సాబ్ కుంట స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి మట్టితో పూడ్చి వేయడం వల్ల ఎఫ్​టీఎల్ స్థలమే కనుమరుగయింది. ప్రస్తుతానికి శిఖం భూమి ఉన్నా... అందులో కూడా దాదాపు సగానికిపైగా భూమి పరాయి వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పటికీ బహిరంగ మార్కెట్​లో ఆక్రమణకు గురైన స్థలాన్ని గజాల చొప్పున విక్రయిస్తే కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఉయ్యాలవాడలోని ఉర చెరువు కుంటను కూడా కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇవే కాక జిల్లాలోని అచ్చంపేటలో మల్లమ్మ కుంట, సాయి నగర్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మ కుంట రికార్డుల్లో విస్తీర్ణం 6 ఎకరాలుగా నమోదైంది. దీనిలోకి పట్టణంలోని వివిధ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు వచ్చి చేరుతుంది. దీని పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిసినా... అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఐదు కోట్లకు పైగా ఉంటుందని, అధికారులు నామమాత్రంగా చర్యలు చేపడ్తున్నారనే ఆరోపిస్తున్నారు.

రెచ్చిపోతున్న కబ్జాదారులు.. ప్రభుత్వ భూములు స్వాహా!

నాగర్​కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత... నాగనూల్​, ఎండబెట్ల, ఉయ్యాలవాడ, దేశి ఇటిక్యాల, నెల్లి కొండను నాగర్​కర్నూల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదునుగా చూసుకొని రియల్ వ్యాపారులు ఈ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న కుంటలు, చెరువు శిఖం భూములు కబ్జాలు చేస్తున్నారు. నాగనూల్ వద్ద ఉన్న పుట్నాల కుంటను భూబకాసురులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో 16.1 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట అలుగును గతేడాది డిసెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది.

కుంట సమీపంలో ఓ వ్యక్తి కొంత వ్యవసాయ భూమి కొనుగోలు చేసి... బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ భూమిని తవ్వి కట్టలు కట్టినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లికొండ సమీపంలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణం ఉన్న చౌటకుంట కట్టను పూర్తిగా ధ్వంసం చేశారు. నాగర్​కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మించడం వల్ల ఆ భూమికి డిమాండ్ పెరిగింది. చుట్టుపక్కల భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. దీనికి ఆశపడి కొందరు రియల్ వ్యాపారులు దాదాపు 10, 11 నెలల క్రితమే కట్ట ఆనవాళ్లు లేకుండా చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కుంట గట్టును ధ్వంసం చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా అప్పుడు అధికారులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

నాగర్​కర్నూల్ నుంచి నాగనూల్ వెళ్లేదారిలో సర్వే నంబర్ 118 లోని 4.9 ఎకరాల విస్తీర్ణంలో సబర్ సాబ్ కుంట స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి మట్టితో పూడ్చి వేయడం వల్ల ఎఫ్​టీఎల్ స్థలమే కనుమరుగయింది. ప్రస్తుతానికి శిఖం భూమి ఉన్నా... అందులో కూడా దాదాపు సగానికిపైగా భూమి పరాయి వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పటికీ బహిరంగ మార్కెట్​లో ఆక్రమణకు గురైన స్థలాన్ని గజాల చొప్పున విక్రయిస్తే కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఉయ్యాలవాడలోని ఉర చెరువు కుంటను కూడా కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇవే కాక జిల్లాలోని అచ్చంపేటలో మల్లమ్మ కుంట, సాయి నగర్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మ కుంట రికార్డుల్లో విస్తీర్ణం 6 ఎకరాలుగా నమోదైంది. దీనిలోకి పట్టణంలోని వివిధ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు వచ్చి చేరుతుంది. దీని పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిసినా... అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఐదు కోట్లకు పైగా ఉంటుందని, అధికారులు నామమాత్రంగా చర్యలు చేపడ్తున్నారనే ఆరోపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.