ETV Bharat / state

డాక్టర్​  సాహస యాత్ర..16వేల కి.మీ ప్రయాణం - డాక్టర్​ సాహస యాత్ర

మహిళలకు సోకే గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్​ నివారణ  ఆవశ్యకతను వివరిస్తూ కర్ణాటక రాష్ట్రం బెలగావ్​కు చెందిన వైద్యురాలు నమ్రతా సింగ్​ సాహస యాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను బైక్​పై చుట్టేసిన నమ్రత ఇప్పుడు నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలానికి చేరారు.

doctor sahasa yatra reached to kalvakurti in nagarkarnul district
కల్వకుర్తికి చేరిన డాక్టర్​ సాహస యాత్ర
author img

By

Published : Dec 17, 2019, 12:46 PM IST

కల్వకుర్తికి చేరిన డాక్టర్​ సాహస యాత్ర

మహిళల్లో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పించడానికి కర్ణాటక రాష్ట్రం బెలగావ్​కు చెందిన డాక్టర్ నమ్రతా సింగ్ సాహసయాత్ర చేపట్టారు. ​

వైద్యవృత్తికి రాజీనామా చేసిన ఆమె దేశవ్యాప్తంగా ఈ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 1న ఛత్తీస్​గఢ్​ జగదల్పూర్​ నుంచి బైక్ యాత్ర మొదలుపెట్టారు. సుమారు 16వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ... నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తికి చేరుకున్నారు.

కల్వకుర్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చిన్న వయసులోనే ఈ వ్యాధుల గురించి తెలిస్తే.. భవిష్యత్​లో ఇవి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అందుకే ప్రాథమిక పాఠశాలు, కళాశాలల స్థాయి విద్యా సంస్థలు సందర్శిస్తున్నట్లు నమ్రత తెలిపారు.

కల్వకుర్తికి చేరిన డాక్టర్​ సాహస యాత్ర

మహిళల్లో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కల్పించడానికి కర్ణాటక రాష్ట్రం బెలగావ్​కు చెందిన డాక్టర్ నమ్రతా సింగ్ సాహసయాత్ర చేపట్టారు. ​

వైద్యవృత్తికి రాజీనామా చేసిన ఆమె దేశవ్యాప్తంగా ఈ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 1న ఛత్తీస్​గఢ్​ జగదల్పూర్​ నుంచి బైక్ యాత్ర మొదలుపెట్టారు. సుమారు 16వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ... నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తికి చేరుకున్నారు.

కల్వకుర్తిలోని బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్​ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చిన్న వయసులోనే ఈ వ్యాధుల గురించి తెలిస్తే.. భవిష్యత్​లో ఇవి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అందుకే ప్రాథమిక పాఠశాలు, కళాశాలల స్థాయి విద్యా సంస్థలు సందర్శిస్తున్నట్లు నమ్రత తెలిపారు.

Intro:tg_mbnr_03_16_mahila_sahasa_yathra_avb_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల కేంద్రానికి చేరిన యువత సాహస యాత్ర. మహిళలకు సోకే గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నివారణ, ఆవశ్యకతను వివరిస్తూ కర్ణాటక రాష్ట్రం బెల్గం కు చెందిన వైద్యురాలు నమ్రత సింగ్ ఇప్పటివరకు 13 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు చిట్టి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రిలో మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వెయ్యికిపైగా పైగా సెమినార్లు నిర్వహించారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్య వృత్తికి రాజీనామా చేసి చత్తీస్ఘడ్ రాష్ట్రం జగదల్పూర్ నుంచి బయల్దేరిన నమ్రతాసింగ్ సెప్టెంబరు 1 రోజున ద్విచక్రవాహనంపై సాహస యాత్రను ప్రారంభించారు. సుమారు 16 వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ కల్వకుర్తి ప్రాంతానికి చేరుకొని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు ఈ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ప్రమాదకరమైన ఈ వ్యాధి వల్ల ప్రపంచం మొత్తం మీద ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతుందని, భవిష్యత్తులో ఈ వ్యాధి ఎవరికి సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ సాహస యాత్రను మొదలు పెట్టినట్లు ఆమె వివరించారు. తాను చేపట్టిన ఈ యాత్ర 38 వేల కిలోమీటర్లు వరకు కొనసాగుతుందని, ఈ సాహస యాత్ర చేసేందుకు ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, దుస్తులు ధరించి జాతీయ స్ఫూర్తిని కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు.


Body:రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన వారిని చూసి కలత చెంది ఈ సాహస యాత్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు.
చిన్న వయసులోనే ఈ వ్యాధుల గురించి తెలిసినవారు భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ వ్యాధులను నిర్మూలించవచ్చని ప్రప్రథమంగా అందుకే ప్రాథమిక పాఠశాలను కళాశాలల స్థాయి విద్యా సంస్థలనుసందర్శించడం ముఖ్య ఉద్దేశమని ఆమె ఈ సందర్భంగా వివరించారు.


Conclusion:బైట్ : నమ్రత సింగ్
సాహస యాత్రికురాలు
కర్ణాటక రాష్ర్టం.

* నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.