ETV Bharat / state

జిల్లాను సేఫ్​ జోన్​గా ఉంచాలి: కలెక్టర్​ శ్రీధర్

author img

By

Published : Apr 24, 2020, 5:11 PM IST

కరోనా మహమ్మారి కట్టడిలో నాగర్​కర్నూల్ జిల్లా పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కలెక్టర్​ శ్రీధర్​ అన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా ప్రభుత్వ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

collector sridhar visit to nagarkurnool district
నాగర్​కర్నూల్​లో కలెక్టర్​ పర్యటన

నాగర్​కర్నూల్​ జిల్లాలో రెండు కంటైన్మెంట్​ ప్రాంతాలను జిల్లా కలెక్టర్​ శ్రీధర్​, ఎస్పీ సాయిశేఖర్​తో కలిసి పరిశీలించారు. 20 రోజులుగా జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్​ కేసు నమోదు కాకపోవడం వల్ల రెడ్​జోన్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

హోంక్వారంటైన్​లో ఉన్నవారు మరికొన్ని రోజులు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్​ సూచించారు. భౌతిక దూరం పాటించి జిల్లాను సేఫ్​ జోన్​గా ఉంచాలని కోరారు.

అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల అంతర్​రాష్ట్ర చెక్​పోస్టును కలెక్టర్​ తనిఖీ చేశారు. కర్నూల్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఉంచాలని ఎస్పీని ఆదేశించారు. సరిహద్దు గ్రామాల్లోకి అపరిచితులెవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

నాగర్​కర్నూల్​ జిల్లాలో రెండు కంటైన్మెంట్​ ప్రాంతాలను జిల్లా కలెక్టర్​ శ్రీధర్​, ఎస్పీ సాయిశేఖర్​తో కలిసి పరిశీలించారు. 20 రోజులుగా జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్​ కేసు నమోదు కాకపోవడం వల్ల రెడ్​జోన్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

హోంక్వారంటైన్​లో ఉన్నవారు మరికొన్ని రోజులు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్​ సూచించారు. భౌతిక దూరం పాటించి జిల్లాను సేఫ్​ జోన్​గా ఉంచాలని కోరారు.

అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల అంతర్​రాష్ట్ర చెక్​పోస్టును కలెక్టర్​ తనిఖీ చేశారు. కర్నూల్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఉంచాలని ఎస్పీని ఆదేశించారు. సరిహద్దు గ్రామాల్లోకి అపరిచితులెవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.