ETV Bharat / state

'తెరాస నిరుద్యోగులను ఆదుకోలేకపోయింది'

విద్య, ఉద్యోగ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ.. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట బీజేవైఎం నేతలు ధర్నా చేపట్టారు. నిరసనకారులను అరెస్టు చేసే క్రమంలో.. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

author img

By

Published : Dec 29, 2020, 5:45 PM IST

bjym leaders held dharna in nagar kurnool achampeta
'తెరాస నిరుద్యోగులను ఆదుకోలేకపోయింది'

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ.. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట బీజేవైఎం నేతలు మండిపడ్డారు. తెరాస నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని మన్ననూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ప్రభుత్వం నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్​లను జారీ చేయాలని నేతలు డిమాండ్​ చేశారు. ప్రైవేట్ స్కూల్​ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించే క్రమంలో.. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు వేముల రాఘవేందర్​తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్ మాయ మాటలు నమ్మకండి: తీన్మార్ మల్లన్న

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ.. నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట బీజేవైఎం నేతలు మండిపడ్డారు. తెరాస నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని మన్ననూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ప్రభుత్వం నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్​లను జారీ చేయాలని నేతలు డిమాండ్​ చేశారు. ప్రైవేట్ స్కూల్​ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించే క్రమంలో.. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు వేముల రాఘవేందర్​తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేసీఆర్ మాయ మాటలు నమ్మకండి: తీన్మార్ మల్లన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.