నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటను సాగు చేయకుండా పంటల మార్పిడి చేయాలని ఎంపీ సూచించారు. వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని జైపాల్ యాదవ్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలు సాగు చేయాలన్నారు.
ఇదీ చదవండిః కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!