ETV Bharat / state

'పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి' - నాగర్ కర్నూల్​ జిల్లా తాజా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... నాగర్​కర్నూల్​ జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి మను చౌదరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల మైదానంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 13వ తేదిన పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించే ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.

evm
evm
author img

By

Published : Mar 10, 2021, 7:33 PM IST

జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... నాగర్​కర్నూల్​ జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి మను చౌదరి తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించి, పోలింగ్‌ శాతాన్ని వెల్లడించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల మైదానంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ప్రత్యేక నిఘా...

పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 13వ తేదీన ఎన్నికల సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్​తో పాటు అదనంగా లార్జ్ సైజ్ బ్యాలెట్ బాక్స్​ చేరవేయనున్నట్లు వెల్లడించారు.

33 వేల 924 మంది ఓటర్లు...

జిల్లాలో మొత్తం 33వేల 924 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. వారిలో 23వేల 718 మంది పురుషులు, 10వేల 202 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏపీలో పోలింగ్ ప్రశాంతం.. మిగిలింది ఫలితమే!

జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 44 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు... నాగర్​కర్నూల్​ జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి మను చౌదరి తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించి, పోలింగ్‌ శాతాన్ని వెల్లడించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల మైదానంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ప్రత్యేక నిఘా...

పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 13వ తేదీన ఎన్నికల సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్​తో పాటు అదనంగా లార్జ్ సైజ్ బ్యాలెట్ బాక్స్​ చేరవేయనున్నట్లు వెల్లడించారు.

33 వేల 924 మంది ఓటర్లు...

జిల్లాలో మొత్తం 33వేల 924 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. వారిలో 23వేల 718 మంది పురుషులు, 10వేల 202 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏపీలో పోలింగ్ ప్రశాంతం.. మిగిలింది ఫలితమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.