ETV Bharat / state

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర" - trs

పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్​ చేశారు. పోడు చేసుకున్న రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు ములుగు జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర"
author img

By

Published : Jul 10, 2019, 6:49 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారిపై దాడులు చేయడమేంటని ఎమ్మెల్యే సీతక్క భగ్గుమన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఆందోళన వల్ల జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర"

ఇవీ చూడండి: రుణమాఫీ చేసి, కొత్త రుణాలివ్వండి: జీవన్ రెడ్డి

ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారిపై దాడులు చేయడమేంటని ఎమ్మెల్యే సీతక్క భగ్గుమన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఆందోళన వల్ల జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీతక్క కన్నెర్ర"

ఇవీ చూడండి: రుణమాఫీ చేసి, కొత్త రుణాలివ్వండి: జీవన్ రెడ్డి

Intro:tg_wgl_52_10_congress_ryali_dharna_ab_ts10072_HD
G Raju mulugu contributer

యాంకర్ : పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, చేసుకున్న రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు.


Body:వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని, గోవిందరావుపేట మండలం రంగాపూర్, సోమలగడ్డ గ్రామాలకు చెందిన రైతులు వారి సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 200మందికి పైగా ఆందోళనలో పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా వస్తున్న భూములకు పట్టా పాస్బుక్కులు ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు అందిస్తుంది. అదే భూమిలో రైతు సాగు చేసుకుంటూ ఉంటే సాగు చేసుకోవద్దు అంటూ ఫారెస్ట్ అధికారులు రైతులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీతక్క ఆందోళన చేపట్టింది. ఇదే సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, మన రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తోందని పెట్రోల్, డీజిల్ రేట్లను అమాంతం పెంచుకుంటూ పోతుందని ఆమె అన్నారు. ఇక రైతుల విషయానికొస్తే రాష్ట్రంలో రైతు బంధు పేరుతో పథకం ఏర్పాటు చేయగా అది అందరు రైతులకు అందడం లేదని ధరణి వెబ్సైట్ లలో తప్పులు దొర్లి రైతులకు అన్యాయం జరుగుతుందని వారు అన్నారు. రైతులకు సాయం సరిగా అందడం లేదని, ఖరీఫ్ సీజన్ మొదలైన కూడా ఎరువులు సకాలంలో అందించగా రేట్లు కూడా పెంచి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, రైతు బంధు పేరుతో బడా బాబులకు మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తుందని, నిరుపేద రైతులకు రెవెన్యూ అధికారులు ధరణి పేరుతో భూమిని పట్టాలు లెక్కించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ధరణి వెబ్సైట్ పేరుతో ఒకరి పేర్లను మరో పేరు బదిలీ చేస్తూ పట్టా పాస్ పుస్తకాలు నెంబర్లు మారుతుందని అన్నారు రు. అసలు రైతు రోజుల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గత కొన్ని సంవత్సరాలుగా కోడు చేసుకున్న గిరిజన, గిరిజనేతరులకు పట్టా పాసు పుస్తకాలు అందించి రైతుబంధు వర్తింపజేసేలా ఆదుకోవాలని అని ఆమె డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఆందోళనలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన నిర్మింప చేయాలని కోరడంతో జాతీయ రహదారి పై నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క మెమోరాండం సమర్పించారు.


Conclusion:బైట్ : ధను సరి అనసూర్య (సీతక్క) ములుగు ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.