ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీల జీతాలు పెంచారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు వస్తున్న జీతాలు వారి కుటుంబ పోషణకు సరిపోయేలా ఉన్నాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అజ్మీర చందూలాల్, జడ్పీ ఛైర్పర్సన్ జగదీశ్వర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: భారత్ బచావో తరహాలో... తెలంగాణా బచావో