ETV Bharat / state

'తాలు పేరిట రైతులను వేధిస్తే.. కఠిన చర్యలే' - Minister Satyavati Rathod opened Paddy Purchase Center in Mulugu district

రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ములుగు మండలం జీవంతరవుపల్లి గ్రామ సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగు జిల్లా సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister Satyavati Rathod opened Paddy Purchase Center in Mulugu district
తాలు పేరిట రైతులను వేధిస్తే... కఠిన చర్యలే
author img

By

Published : Apr 28, 2020, 7:59 PM IST

ములుగు జిల్లా జీవంతరవుపల్లి గ్రామ సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యంలో తాలు, మట్టిపెళ్లలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ధాన్యంలో తాలు పేరిట రైస్​ మిల్లర్లు అన్నదాతలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పనులకు దాదాపు 20వేల మందికి పైగా హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్​పర్సన్​ కుసుమ జగదీష్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ములుగు జిల్లా జీవంతరవుపల్లి గ్రామ సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యంలో తాలు, మట్టిపెళ్లలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ధాన్యంలో తాలు పేరిట రైస్​ మిల్లర్లు అన్నదాతలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పనులకు దాదాపు 20వేల మందికి పైగా హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్​పర్సన్​ కుసుమ జగదీష్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.