ETV Bharat / state

crowd in medaram: జాతర ముగిసినా మేడారంలో తగ్గని భక్తుల రద్దీ

author img

By

Published : Feb 27, 2022, 4:31 PM IST

crowd in medaram: మేడారం మహాజాతర ముగిసినా భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు సరిహద్దు రాష్ట్రాల ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది.

crowd in medaram
మేడారంలో భక్తుల రద్దీ

crowd in medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఇటీవలే మేడారం మహాజాతర ముగిసింది. అయిప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్​గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వచ్చారు.

ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న భక్తులు పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, బంగారం (బెల్లం) నూతన వస్త్రాలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.

crowd in medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఇటీవలే మేడారం మహాజాతర ముగిసింది. అయిప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్​గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున వచ్చారు.

ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న భక్తులు పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, బంగారం (బెల్లం) నూతన వస్త్రాలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.