ETV Bharat / state

'ఉపాధి కోల్పోయిన వేళ అధిక ఫీజులతో వేధించడం సరికాదు' - రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా భాజపా ధర్నా

రాష్ట్రంలో అధిక విద్యుత్‌ ఛార్జీలు విధించడాన్ని నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో ఆందోళన నిర్వహించారు. సబ్ స్టేషన్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు పాల్గొన్నారు. ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న ప్రజలపై.. ప్రభుత్వం కరెంట్​ ఛార్జీల రూపంలో పెనుభారం మోపిందని ఆరోపించారు.

Bjp Dharna in Mullu district on high electricity charges
అధిక విద్యుత్‌ ఛార్జీలపై ములుగు జిల్లాలో భాజపా ధర్నా
author img

By

Published : Jun 15, 2020, 6:33 PM IST

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న ప్రజలపై.. తెలంగాణ ప్రభుత్వం పెనుభారం మోపిందని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ములుగు జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

స్లాబ్‌ల పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మండిపడ్డారు. రాష్ట్రంలో అధిక విద్యుత్‌ ఛార్జీలు విధించడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి.. స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న ప్రజలపై.. తెలంగాణ ప్రభుత్వం పెనుభారం మోపిందని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ములుగు జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

స్లాబ్‌ల పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మండిపడ్డారు. రాష్ట్రంలో అధిక విద్యుత్‌ ఛార్జీలు విధించడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి.. స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దిల్లీలో కరోనా తీవ్రం.. 6 రోజుల్లోనే 10వేల కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.