ETV Bharat / state

మేడ్చల్​ జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరైన కార్మికులు - మేడ్చల్​ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు తమ తమ డిపోలకు తరలివస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద సందడి నెలకొంది.

rtc workers joining thir duties in medchal district
మేడ్చల్​ జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరవుతున్న కార్మికులు
author img

By

Published : Nov 29, 2019, 11:40 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు తమ డిపోలకు తరలివస్తున్నారు. ముందుగా చనిపోయిన కార్మికులకు నివాళులు అర్పించి... విధుల్లో చేరుతున్నారు.

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా హకీంపేట డిపో వద్దకు ఉదయం నుంచే కార్మికులు తరలివచ్చారు. చనిపోయిన వారికి నివాళిగా డిపో వద్ద కాసేపు మౌనం పాటించారు. అనంతరం విధుల్లో చేరారు.

ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్​ తమను విధులకు అనుమతించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి మరింత కష్టపడి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలు పొందేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

కూకట్​పల్లి, కుషాయిగూడలోనూ...

మరోవైపు కూకట్​పల్లి, కుషాయిగూడ డిపోల వద్ద సైతం కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే కార్మికులు విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమ కష్టాలను అర్థం చేసుకుని... ఎలాంటి షరతులు లేకుండా విధులకు అనుమతించడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

మేడ్చల్​ జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరవుతున్న కార్మికులు

52 రోజుల సమ్మె అనంతరం శాశ్వత ఆర్టీసీ కార్మికులతో బస్సులు రోడ్ల పైకి వచ్చాయి.

ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు తమ డిపోలకు తరలివస్తున్నారు. ముందుగా చనిపోయిన కార్మికులకు నివాళులు అర్పించి... విధుల్లో చేరుతున్నారు.

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా హకీంపేట డిపో వద్దకు ఉదయం నుంచే కార్మికులు తరలివచ్చారు. చనిపోయిన వారికి నివాళిగా డిపో వద్ద కాసేపు మౌనం పాటించారు. అనంతరం విధుల్లో చేరారు.

ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్​ తమను విధులకు అనుమతించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి మరింత కష్టపడి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలు పొందేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

కూకట్​పల్లి, కుషాయిగూడలోనూ...

మరోవైపు కూకట్​పల్లి, కుషాయిగూడ డిపోల వద్ద సైతం కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే కార్మికులు విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమ కష్టాలను అర్థం చేసుకుని... ఎలాంటి షరతులు లేకుండా విధులకు అనుమతించడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

మేడ్చల్​ జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరవుతున్న కార్మికులు

52 రోజుల సమ్మె అనంతరం శాశ్వత ఆర్టీసీ కార్మికులతో బస్సులు రోడ్ల పైకి వచ్చాయి.

ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య

Intro:TG_HYD_17_29_KUSHAIGUDA_DEPO_AV_TS10015
Contributor: satish_mlkg

యాంకర్: యాంకర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపో లో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి హాజరయ్యారు. ఆర్టీసీ లాభాల బాటలో నడవాలంటే కిలోమీటర్కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతామని సీఎం ప్రకటించారు. మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం ప్రకటించడాన్ని వారు హర్షం వ్యక్తం చేశారు.Body:KgConclusion:Kg

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.