ETV Bharat / state

'సీసీ కెమెరాలతో దొంగతనాలు, నేరాలకు అడ్డుకట్ట' - kuthbullapur mla news

జీడిమెట్ల డివిజన్​ పరిధిలో రూ. 5లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే వివేకానంద్​, బాలానగర్​ జోన్​ డీసీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సీఎం కేసీఆర్​ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో దొంగతనాలు, నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు.

jeedimetala division, cc cameras, mla kp vivekanand
జీడిమెట్ల డివిజన్​, సీసీ కెమెరాలు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​
author img

By

Published : Jan 9, 2021, 9:29 PM IST

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర కాలని ఈస్ట్​లో నూతనంగా సీసీ కెమెరాలను ప్రారంభించారు. దాత కేఎం ప్రతాప్ ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో 32 సీసీ కెమెరాలను బాలానగర్ జోన్ డీసీపీ పీవీ పద్మజ, కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. అనంతరం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సాగించాలంటే శాంతి భద్రతలతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడం కీలకమని ఎమ్మెల్యే అన్నారు.

మహిళా భద్రత కోసం

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పోలీస్‌ విభాగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ నిధులను సమకూర్చడంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఫలితంగా స్వల్పకాలంలోనే దేశంలోనే మెరుగైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత కల్పించడంతోపాటు మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలను చాలా వరకు నివారించవచ్చని చెప్పారు.

హైదరాబాద్​లో ఇప్పటికే సుమారు 7 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరైనా అపరిచితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితులను సులభంగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వేంకటేశ్వర కాలని ఈస్ట్​లో నూతనంగా సీసీ కెమెరాలను ప్రారంభించారు. దాత కేఎం ప్రతాప్ ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో 32 సీసీ కెమెరాలను బాలానగర్ జోన్ డీసీపీ పీవీ పద్మజ, కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. అనంతరం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సాగించాలంటే శాంతి భద్రతలతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడం కీలకమని ఎమ్మెల్యే అన్నారు.

మహిళా భద్రత కోసం

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పోలీస్‌ విభాగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ నిధులను సమకూర్చడంతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఫలితంగా స్వల్పకాలంలోనే దేశంలోనే మెరుగైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత కల్పించడంతోపాటు మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలను చాలా వరకు నివారించవచ్చని చెప్పారు.

హైదరాబాద్​లో ఇప్పటికే సుమారు 7 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరైనా అపరిచితులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితులను సులభంగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.