మేడ్చల్ జిల్లాలోని నేరెడ్మెట్ సింహాద్రి నగర్లో దొంగతానాలు మొదలయ్యాయి. ఒక ఇంటి తాళాలు పగలగొట్టి 10 తులాల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. డబ్బు, బంగారం లాంటి ఆస్తులను జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చూడండి : రాజకీయంగా చూడొద్దు: బండి సంజయ్