ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఏసీపీ నరసింహా రెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ను అనిశా న్యాయస్థానం జారీ చేసింది. మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నరసింహా రెడ్డిపై సెప్టెంబర్ 23న అనిశా అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో చంచల్ గూడ జైలులో నరసింహా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనిశా అధికారుల సోదాల్లో నరసింహా రెడ్డి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, మాదాపూర్లోని సైబర్ టవర్స్ సమీపంలో రూ.50 కోట్ల ఖరీదైన స్థలం, హఫీజ్ పేట్లో బహుళ అంతస్తుల భవనంతో పాటు పలుచోట్లా బినామీల పేర్లమీద ఆస్తులున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.
మాదాపూర్లోని రూ.50 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని నరసింహా రెడ్డి తన బినామీ పేర్లమీద దక్కించుకున్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. అనిశా అధికారులు నర్సింహ రెడ్డిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: కారులో ఇరుక్కుని ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి