ETV Bharat / state

అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు

author img

By

Published : Jul 21, 2019, 11:52 PM IST

పేదల క్షుద్బాధను తీర్చేందుకు సర్కారు అందిస్తున్న బియ్యాన్ని  కొందరు కేటుగాళ్లు దారిమళ్లిస్తున్నారు. టన్నుల కొద్దీ బియ్యాన్ని అక్రమంగా తరలించి పేదల కడుపు కొడుతున్నారు. మేడ్చల్​ జిల్లాలో ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.

అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు
అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రూపాయికే కిలో బియ్యం పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. వ్యాపారుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్​ జిల్లా మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హేమానగర్​లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన 50 టన్నుల రేషన్​ బియ్యాన్ని రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 600 బస్తాలతో పాటు, ఓ లారీని సీజ్​ చేశారు.

డీలర్లతో కుమ్మక్కై అక్రమ దందా

గత రెండు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి రేషన్​ డీలర్లు, కార్డు లబ్ధిదారుల నుంచి కేజీ రూ. 10 నుంచి 13కు కొనుగోలు చేసి ఈ గోదాములో నిల్వ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారంతో దాడిచేసిన పోలీసులు బియ్యాన్ని, లారీని పట్టుకున్నారు. వాటిని గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, గోదాములో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించామన్నారు.
ఇదీ చూడండి: పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

అక్రమ రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రూపాయికే కిలో బియ్యం పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. వ్యాపారుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్​ జిల్లా మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హేమానగర్​లో ఓ గోదాంలో నిల్వ ఉంచిన 50 టన్నుల రేషన్​ బియ్యాన్ని రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 600 బస్తాలతో పాటు, ఓ లారీని సీజ్​ చేశారు.

డీలర్లతో కుమ్మక్కై అక్రమ దందా

గత రెండు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి రేషన్​ డీలర్లు, కార్డు లబ్ధిదారుల నుంచి కేజీ రూ. 10 నుంచి 13కు కొనుగోలు చేసి ఈ గోదాములో నిల్వ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారంతో దాడిచేసిన పోలీసులు బియ్యాన్ని, లారీని పట్టుకున్నారు. వాటిని గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, గోదాములో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించామన్నారు.
ఇదీ చూడండి: పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

Tg_nlg_185_21_yadadri__baktha_janam_av_TS10134 యాదాద్రి భువనగిరి... సెంటర్...యాదగిరిగుట్ట... రిపోర్టర్...చంద్రశేఖర్ ..ఆలేరు సెగ్మెంట్...9177863630 వాయిస్:యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు..ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు...పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని సన్నిధిలో సందడి పెరిగింది.. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహులను దర్శించుకుని తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి...దీంతో స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు రెండు గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నుండి గంటన్నర సమయం వరకు పడుతోంది.మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.