మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని వీఎన్ఆర్ & వీజే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి డిసెంబర్ 1న ప్రత్యేక సదస్సు చేపట్టనున్నారు. యాన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ పేరెంట్స్ & స్టూడెంట్స్' సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల సంచాలకులు అన్నారు. సదస్సుకు తల్లిదండ్రులు, పిల్లలు హాజరవ్వాలని ఆమె కోరారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలను ఎలా గైడ్ చేయాలి, సోషల్ మీడియా, ఫోన్, ట్యాబ్ల బారిన పడకుండా పిల్లలను ఎలా దారిలో పెట్టాలనే విషయంపై సదస్సులో తెలుసుకోవచ్చని అన్నారు.
మేమున్నాం...కౌన్సిలింగ్ ఇస్తాం
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య గ్యాప్ ఎక్కువ రావడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. తద్వారా తల్లిదండ్రులకు పిల్లలపై వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు ఉంటాయని, ఆన్లైన్లో ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి : సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!