ETV Bharat / state

ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి ఘటనతో వెనకడుగు వేయం: సజ్జనార్

author img

By

Published : Mar 31, 2021, 3:34 PM IST

Updated : Mar 31, 2021, 5:17 PM IST

హైదరాబాద్ నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై అన్నపురెడ్డి మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బ్రెయిన్​ డెడ్​తో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఏఎస్​ఐ మరణంపై సైబరాబాద్ సీపీ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Asi mahipal reddy
ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి

ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డిపై పోలీస్​శాఖ ప్రత్యేక వీడియో

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్​పై మరింత కఠినంగా వ్యవహారిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. తనిఖీల్లో ఉన్న సిబ్బంది భద్రత విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. ఈనెల 27న నిజాంపేట డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీల్లో గాయపడిన హోంగార్డు కేసులో దర్యాప్తుకు వెళ్లిన ఏఎస్​ఐ మహిపాల్‌ రెడ్డిని ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కుటుంబసభ్యులు అతని అవయవాలను దానం చేశారు. అనంతరం రాజేంద్రనగర్‌ కిస్మత్​పూర్‌లోని ఆయన స్వగృహానికి పార్థివ దేహాన్ని తరలించారు. ఏఎస్​ఐ అంత్యక్రియలకు సజ్జనార్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి ఘటనతో వెనకడుగు వేసేది లేదు. మహిపాల్ రెడ్డి స్ఫూర్తిగా మరింత ఉత్సాహంగా పని చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కచ్చితంగా వ్యవహరిస్తాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లోని సిబ్బంది భద్రతకు చర్యలు చేపడతాం. ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తన అవయవాలను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

-- సజ్జనార్, సైబరాబాద్ సీపీ

ఏఎస్​ఐ మహిపాల్ రెడ్డిని స్మరించుకుంటూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆయన అవయవదానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ వీడియోలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: గాయపడిన ఏఎస్సై మహిపాల్​రెడ్డి మృతి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు

ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డిపై పోలీస్​శాఖ ప్రత్యేక వీడియో

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్​పై మరింత కఠినంగా వ్యవహారిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. తనిఖీల్లో ఉన్న సిబ్బంది భద్రత విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. ఈనెల 27న నిజాంపేట డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీల్లో గాయపడిన హోంగార్డు కేసులో దర్యాప్తుకు వెళ్లిన ఏఎస్​ఐ మహిపాల్‌ రెడ్డిని ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కుటుంబసభ్యులు అతని అవయవాలను దానం చేశారు. అనంతరం రాజేంద్రనగర్‌ కిస్మత్​పూర్‌లోని ఆయన స్వగృహానికి పార్థివ దేహాన్ని తరలించారు. ఏఎస్​ఐ అంత్యక్రియలకు సజ్జనార్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి ఘటనతో వెనకడుగు వేసేది లేదు. మహిపాల్ రెడ్డి స్ఫూర్తిగా మరింత ఉత్సాహంగా పని చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కచ్చితంగా వ్యవహరిస్తాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లోని సిబ్బంది భద్రతకు చర్యలు చేపడతాం. ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తన అవయవాలను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

-- సజ్జనార్, సైబరాబాద్ సీపీ

ఏఎస్​ఐ మహిపాల్ రెడ్డిని స్మరించుకుంటూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆయన అవయవదానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ వీడియోలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: గాయపడిన ఏఎస్సై మహిపాల్​రెడ్డి మృతి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు

Last Updated : Mar 31, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.