ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

author img

By

Published : May 24, 2021, 12:59 PM IST

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్​ను అందరూ పాటించాలని కోరారు. హైదరాబాద్​లోని​ మియాపూర్ అల్విన్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టును ఆయన తనిఖీ చేశారు.

Cyberabad CP sajjanar enquiry on checkpost
మియాపూర్ అల్విన్‌ కూడలి వద్ద తనిఖీలు చేపట్టిన సీపీ సజ్జనార్

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్​ విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. హైదరాబాద్​లోని మియాపూర్ అల్విన్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన సందర్శించారు.

చెక్‌పోస్టు వద్ద ప్రతి ఒక్క వాహనదారున్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపించి వేశారు. కొందరు నకిలీ గుర్తింపుకార్డులు ధరించి డెలివరీ బాయ్స్​గా బయటకు వస్తున్నారని సీపీ తెలిపారు. అత్యవసర పనుల కోసం గుర్తింపుకార్డులు కలిగిన వారే బయటకు రావాలని.. అనవసరంగా తిరిగే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్​ విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. హైదరాబాద్​లోని మియాపూర్ అల్విన్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన సందర్శించారు.

చెక్‌పోస్టు వద్ద ప్రతి ఒక్క వాహనదారున్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపించి వేశారు. కొందరు నకిలీ గుర్తింపుకార్డులు ధరించి డెలివరీ బాయ్స్​గా బయటకు వస్తున్నారని సీపీ తెలిపారు. అత్యవసర పనుల కోసం గుర్తింపుకార్డులు కలిగిన వారే బయటకు రావాలని.. అనవసరంగా తిరిగే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.