ETV Bharat / state

నెరేడ్​మెట్​లో సైబర్​ యోదా అవగాహన కార్యక్రమం

author img

By

Published : Jan 31, 2021, 5:08 PM IST

మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్​ పరిధి నెరేడ్​మెట్​లో సైబర్​యోదా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్... సైబర్​ నేరాలపై అవగాహన కల్పించారు.

నేరేడిమెట్​లో సైబర్​ యోదా అవగాహన కార్యక్రమం
నెరేడ్​మెట్​లో సైబర్​ యోదా అవగాహన కార్యక్రమం

నెరేడ్​మెట్​లో సైబర్​యోదా అవగాహన కార్యక్రమం జరిగింది. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, ఎడ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేటి యువత సామాజిక మాధ్యమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని.. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వివరించారు. సైబర్​ నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్ యోదా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

నెరేడ్​మెట్​లో సైబర్​యోదా అవగాహన కార్యక్రమం జరిగింది. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, ఎడ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేటి యువత సామాజిక మాధ్యమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని.. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వివరించారు. సైబర్​ నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్ యోదా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: రైతుల దీక్షకు మద్దతుగా ట్రాక్టర్లతో కాంగ్రెస్ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.