ETV Bharat / state

రియల్టర్ మల్లారెడ్డిపై రాష్ట్ర హెచ్​ఆర్సీలో ఫిర్యాదు - రియల్టర్ మల్లారెడ్డి తాజా సమాచారం

రియల్టర్ నల్ల మల్లారెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మేడ్చల్​ జిల్లా కాచావాని సింగారం గ్రామంలోని దివ్య నగర్ వెంచర్ ఫ్లాట్లు కొనుగోలుదారులు ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Complaint against Realtor Mallareddy in state hrc
రియల్టర్ మల్లారెడ్డిపై రాష్ట్ర హెచ్​ఆర్సీలో ఫిర్యాదు
author img

By

Published : Feb 6, 2021, 4:39 PM IST

రియల్టర్ నల్ల మల్లారెడ్డి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచావాని సింగారం గ్రామంలోని దివ్యనగర్ వెంచర్ ఫ్లాట్లు కొనుగోలుదారులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కల కమిషన్​లో ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని కాచావాని సింగారం గ్రామం దివ్య నగర్ వెంచర్​లో 1993లోనే 4,500 మంది సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారని బాధితుల తరపు న్యాయవాది రాపోలు ఆనంద్ భాస్కర్ తెలిపారు. ఫ్లాట్​ల అభివృద్ధి కోసం వెంచర్ యజమాని నల్ల మల్లారెడ్డి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరైనా ఫ్లాటును అమ్ముకోవాలంటే ఐదు నుంచి పది లక్షలు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని బాధితులు తెలిపారు. తనకు మంత్రులు మల్లారెడ్డి, ఈటెల రాజేందర్​ల అండదండలు ఉన్నాయని... ఎవరూ ఏమి చేయలేరని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మేడిపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ కమిషనర్​కు ఆదేశాలు జారీ చేసిందని న్యాయవాది వివరించారు.

ఇదీ చదవండి: మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

రియల్టర్ నల్ల మల్లారెడ్డి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచావాని సింగారం గ్రామంలోని దివ్యనగర్ వెంచర్ ఫ్లాట్లు కొనుగోలుదారులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కల కమిషన్​లో ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని కాచావాని సింగారం గ్రామం దివ్య నగర్ వెంచర్​లో 1993లోనే 4,500 మంది సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారని బాధితుల తరపు న్యాయవాది రాపోలు ఆనంద్ భాస్కర్ తెలిపారు. ఫ్లాట్​ల అభివృద్ధి కోసం వెంచర్ యజమాని నల్ల మల్లారెడ్డి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరైనా ఫ్లాటును అమ్ముకోవాలంటే ఐదు నుంచి పది లక్షలు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని బాధితులు తెలిపారు. తనకు మంత్రులు మల్లారెడ్డి, ఈటెల రాజేందర్​ల అండదండలు ఉన్నాయని... ఎవరూ ఏమి చేయలేరని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మేడిపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ కమిషనర్​కు ఆదేశాలు జారీ చేసిందని న్యాయవాది వివరించారు.

ఇదీ చదవండి: మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.