ETV Bharat / state

క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

author img

By

Published : Dec 18, 2019, 4:10 PM IST

క్వారీ గుంతలో రాళ్ళు కొడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన దుండిగల్​ ఠాణా పరిధిలో జరిగింది. గుంతలో రాళ్లు కొడుతుండగా పైన టిప్పర్ అన్​లోడ్​ చేయడం రాళ్లు మీదపడి మృతిచెందాడు.

A man dies while throwing stones at a quarry in dundigal
క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా, దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. లారీ డ్రైవర్​ నిర్లక్ష్యంతో క్వారీ గుంతలో రాళ్లు కొడుతున్న వ్యక్తిపై రాళ్లు పడి మృతిచెందాడు. జవహర్​నగర్​కు చెందిన నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలతో బతుకుదెరువుకోసం దుండిగల్​ ఠాణా పరిధిలోని కైసర్​నగర్​కు వలసొచ్చాడు. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకొని క్వారీలో రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

రోజుమాదిరి గానే క్వారీ గుంతలో రాళ్లు కొడుతుండగా క్వారీ పైనుంచి లారీలో రాళ్లను అన్​లోడ్​ చేయడం వల్ల రాళ్లు మీద పడడం వల్ల నాగరాజు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఇదీ చూడండి: చిన్నారిని కిడ్నాప్ చేశాడు..పోలీసులకు లొంగిపోయాడు..

మేడ్చల్ జిల్లా, దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. లారీ డ్రైవర్​ నిర్లక్ష్యంతో క్వారీ గుంతలో రాళ్లు కొడుతున్న వ్యక్తిపై రాళ్లు పడి మృతిచెందాడు. జవహర్​నగర్​కు చెందిన నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలతో బతుకుదెరువుకోసం దుండిగల్​ ఠాణా పరిధిలోని కైసర్​నగర్​కు వలసొచ్చాడు. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకొని క్వారీలో రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

రోజుమాదిరి గానే క్వారీ గుంతలో రాళ్లు కొడుతుండగా క్వారీ పైనుంచి లారీలో రాళ్లను అన్​లోడ్​ చేయడం వల్ల రాళ్లు మీద పడడం వల్ల నాగరాజు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

క్వారీలో రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఇదీ చూడండి: చిన్నారిని కిడ్నాప్ చేశాడు..పోలీసులకు లొంగిపోయాడు..

TG_HYD_31_18_QUARYLO VYAKTHI MRUTHI_AV_TS10011 Anchor: క్వారీ గుంతలో రాళ్ళు కొడుతున్న వ్యక్తిపై టిప్పర్ లారీ రాళ్ళను అన్ లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రాళ్ళు ఆ వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దుండిగల్ పియస్ పరిధిలో చోటుచేసుకుంది. Voice Over: మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన నాగరాజు తన భార్య, 3 ముగ్గురు పిల్లలతో సంవత్సరం క్రితం బ్రతుకు తెరువు కోసం దుండిగల్ పియస్ పరిధిలోని కైసర్ నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు రాళ్ళు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయం కైసర్ నగర్ లో ఉన్న ఓ క్వారీ గుంతలో ఉన్న రాళ్ళను కంకర కోసం పగల కొడుతుండగా ...క్వారీ పైన రాళ్ళ లోడ్ తో వచ్చిన ఓ టిప్పర్ లారీ కింద నాగరాజు ను గమనించకుండా రాళ్ళను అన్ లోడ్ చేసాడు. క్వారీ గుంత లోపల ఉన్న నాగరాజు పై ఒక్కసారి రాళ్ళు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. స్దానికులు ఇచ్చిన సమాచారం మేరకు దుండిగల్ పియస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సంఘటన స్దలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి కి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.