ETV Bharat / state

సీఎం నియోజకవర్గంలో నీటి కష్టాలు...

మెదక్ జిల్లాలోని కాళ్లకల్ గ్రామంలో గత కొన్నిరోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం వల్ల తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆగ్రహించిన వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

author img

By

Published : Aug 17, 2019, 5:58 PM IST

సీఎం నియోజకవర్గంలో నీటి కష్టాలు...

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం వల్ల తాగునీటికి తీవ్ర ఇబ్బంది నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు వార్డు సభ్యులు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అధికారులు, సర్పంచ్ రాకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్డు సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాలను గాంధీ విగ్రహానికి సమర్పించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని కాళ్లకల్​లో 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయితే అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారులు, సర్పంచ్ స్పందించి నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం నియోజకవర్గంలో నీటి కష్టాలు...

ఇదీ చూడండి :రాయగిరిలో ఆగి స్థానిక నేతలతో ముచ్చటించిన కేసీఆర్​

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం వల్ల తాగునీటికి తీవ్ర ఇబ్బంది నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు వార్డు సభ్యులు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అధికారులు, సర్పంచ్ రాకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్డు సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాలను గాంధీ విగ్రహానికి సమర్పించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని కాళ్లకల్​లో 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయితే అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారులు, సర్పంచ్ స్పందించి నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం నియోజకవర్గంలో నీటి కష్టాలు...

ఇదీ చూడండి :రాయగిరిలో ఆగి స్థానిక నేతలతో ముచ్చటించిన కేసీఆర్​

TG_SRD_43_17_WATER_AB_TS10115 రిపోర్టర్.శేఖర్. మెదక్.9000302217. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కళకల్ గ్రామంలో గత కొన్నిరోజులుగా తమ గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంత తీవ్రంగా త్రాగు నీటి ఎద్దడి నెలకొంది అని ఆగ్రహం చెంది గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఆందోళనకు దిగారు... మనోహరాబాద్ మండలంలోని కళకల్ గ్రామపంచాయతీ ముందు రెండు గంటల పాటు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ధర్నా నిర్వహించిన అధికారులు, సర్పంచ్ ,ఎవరు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్డు సభ్యులు.తమ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి రాజీనామా పత్రాలను గాంధీ విగ్రహం కు సమర్పించారు ...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నైనా త్రాగునీటి సరఫరా చేయాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు ..ముఖ్యమంత్రి నియోజకవర్గం లోని కళకల్ గ్రామంలో 12 రోజులుగా నీటి సరఫరా లేనప్పటికీ అధికారులు పట్టించుకోవడం పోవడంపై సిగ్గుచేటని ఇప్పటికైనా అధికారులు సర్పంచ్ ,స్పందించి నీటి సరఫరా.చేయాలని.వారు డిమాండ్ చేశారు. Byte: వార్డు సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.