మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అర్బన్ పార్క్ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించినందును పర్యటకులెవరూ ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావొద్దని జిల్లా అటవీ అధికారి వి. వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా నర్సాపూర్ - హైదరాబాద్ రహదారిపై ప్లాస్టిక్ ఫీ డ్రైవ్ను నిర్వహించారు.
భూమిలో ప్లాస్టిక్ కరిగిపోవడానికి సుమారు వందేళ్లు పడుతుందని అటవీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దాని వల్ల అటవీ జంతువులకుకూడా అనేక రోగాలు సంభవిస్తాయని అన్నారు. పార్క్ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడితే జరిమాన విధిస్తామని హెచ్చరించారు. దశల వారీగా అన్ని అటవీ ప్రాంతాల్లో, అర్బన్ పార్కుల్లో స్పెషల్ డ్రైవ్లు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అటవీ రేంజ్ అధికారులు అంబర్సింగ్, బాలేశం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే... అందరి గుట్టు రట్టు చేస్తాం'