ETV Bharat / state

సూర్య గ్రహణం ఎఫెక్ట్​ : వనదుర్గా భవానీ ఆలయం మూసివేత - Suryagrahanam Vanadurgabhavani temple

సూర్య గ్రహణం సందర్భంగా మెదక్​ జిల్లా పాపన్నపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వన దుర్గా భవానీ ఆలయాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో శ్రీనివాస్​ తెలిపారు. తిరిగి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆలయం తెరుస్తామన్నారు.

వనదుర్గా భవానీ ఆలయం
వనదుర్గా భవానీ ఆలయం
author img

By

Published : Jun 20, 2020, 3:08 PM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వన దుర్గా భవానీ దేవస్థానాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆదివారం ఉదయం నుంచి భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదన్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణల అనంతరం ఆలయం తెరుస్తామన్నారు. అభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు, ఆలయ ఈవో తెలిపారు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వన దుర్గా భవానీ దేవస్థానాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆదివారం ఉదయం నుంచి భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదన్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణల అనంతరం ఆలయం తెరుస్తామన్నారు. అభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు, ఆలయ ఈవో తెలిపారు.

ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.