మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వన దుర్గా భవానీ దేవస్థానాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఆదివారం ఉదయం నుంచి భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదన్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణల అనంతరం ఆలయం తెరుస్తామన్నారు. అభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు, ఆలయ ఈవో తెలిపారు.
ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్