ETV Bharat / state

'లాక్​డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు' - 'లాక్​డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు'

మెదక్ జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేస్తూ… పూర్తి స్థాయి లాక్​డౌన్​కు ఎల్లవేళలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి అన్నారు. ప్రజలందరూ లాక్​డౌన్ పూర్తయ్యేవరకు బయటకు రాకూడదని కోరారు.

MEDAK SP CHANDANA DEEPTHI
'లాక్​డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు'
author img

By

Published : Apr 25, 2020, 4:13 PM IST

మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్​డౌన్​కు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తుందని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ను ప్రజలందరూ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ... కరోనా కట్టడికి ఎల్లవేళలా కృషి చేస్తోందని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు చేస్తూ లాక్​డౌన్​ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నామని అన్నారు.

మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్​డౌన్​కు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తుందని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ను ప్రజలందరూ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ... కరోనా కట్టడికి ఎల్లవేళలా కృషి చేస్తోందని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు చేస్తూ లాక్​డౌన్​ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నామని అన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.