ETV Bharat / state

నర్సాపూర్​ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా విద్యాధికారి! - Medak Narsapur

విద్యార్థులు ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేలా.. తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని మెదక్​ జిల్లా విద్యాధికారి రమేష్​ కుమార్​ అన్నారు. నర్సాపూర్​ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నర్సాపూర్​ పట్టణంలోని పలు గ్రామాల్లో పర్యటించి విద్యార్థులు ఆన్​లైన్​లో పాఠాలు వింటున్నారా లేదా అని తనిఖీ చేశారు.

Medak District Collector Visits Schools in Narsapur
నర్సాపూర్​ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా విద్యాధికారి!
author img

By

Published : Sep 3, 2020, 10:14 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలో జిల్లా విద్యాధికారి పర్యటించారు. విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నర్సాపూర్​ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించారు. తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలని మండల విద్యాధికారులను ఆదేశించారు.

మహ్మదాబాద్​ గ్రామ సమీపంలోని కస్తూరిబా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో పలు రికార్డులను తనిఖీ చేశారు. పలు గ్రామాలు, గిరిజన తండాలకు వెళ్లి విద్యార్థులు ఆన్​లైన్​ పాఠాలు వింటున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యుత్​ సరఫరా నిలిచిపోతే.. సెల్​ఫోన్​లో క్లాసులు వినాలని సూచించారు. పిల్లలు ఆన్​లైన్​లో పాఠాలు వినేందుకు వారికి కేటాయించిన సమయంలో ఫోన్‌ అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్ధులు ఇంటి వద్దే ఉంటూ.. ఆన్​లైన్​ పాఠాలు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కౌడిపల్లి మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి సుభాష్, ప్రిన్సిపల్‌ శ్వేత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలో జిల్లా విద్యాధికారి పర్యటించారు. విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నర్సాపూర్​ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించారు. తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలని మండల విద్యాధికారులను ఆదేశించారు.

మహ్మదాబాద్​ గ్రామ సమీపంలోని కస్తూరిబా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో పలు రికార్డులను తనిఖీ చేశారు. పలు గ్రామాలు, గిరిజన తండాలకు వెళ్లి విద్యార్థులు ఆన్​లైన్​ పాఠాలు వింటున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యుత్​ సరఫరా నిలిచిపోతే.. సెల్​ఫోన్​లో క్లాసులు వినాలని సూచించారు. పిల్లలు ఆన్​లైన్​లో పాఠాలు వినేందుకు వారికి కేటాయించిన సమయంలో ఫోన్‌ అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్ధులు ఇంటి వద్దే ఉంటూ.. ఆన్​లైన్​ పాఠాలు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కౌడిపల్లి మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి సుభాష్, ప్రిన్సిపల్‌ శ్వేత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.