ETV Bharat / state

'టీ కన్సల్ట్​ టెలీ మెడిసిన్' ను ప్రారంభించిన కలెక్టర్​ - corona virus update news

మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో తెలంగాణ ఇన్పర్మేషన్​ టెక్నాలజీ అసోసియేషన్​ వారు ప్రవేశపెట్టిన 'టీ కన్సల్ట్​ టెలీ మెడిసిన్​'ను జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్​ డాక్టర్లను పేషెంట్లను కలుపుతుందని... లాక్‌డౌన్‌ సమయంలో ఈ యాప్ ద్వారా ప్రజలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చని తెలిపారు.

medak collector inaugurated t-consult tele medicine
'టీ కన్సల్ట్​ టెలీ మెడిసిన్' ను ప్రారంభించిన కలెక్టర్​
author img

By

Published : May 4, 2020, 7:32 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు 'టీ కన్సల్ట్ టెలీ మెడిసిన్' ప్రవేశపెట్టారు. దానిని ఈరోజు మెదక్ కలెక్టరేట్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్​ డాక్టర్లను పేషెంట్లను కలుపుతుందని... లాక్‌డౌన్‌ సమయంలో ఈ యాప్ ద్వారా ప్రజలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.


జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా... నలుగురు పూర్తిగా కోలుకున్నారని మెదక్​ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి తెలిపారు. వారిని డిశ్చార్జి చేయడం జరిగిందని.. ఇంకా ఒక వ్యక్తి త్వరలో కోలుకొని డిశ్చార్జ్ అవుతాడనిపేర్కొన్నారు. ఆరెంజ్ జోన్​ నుంచి గ్రీన్ జోన్​లోకి మెదక్ జిల్లా మారే అవకాశముందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బయటనుంచి వచ్చిన వ్యక్తులు గాని, ఇంకా ఇతర సమస్యలు ఉంటే కలెక్టరేట్​లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08452-223360కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు 'టీ కన్సల్ట్ టెలీ మెడిసిన్' ప్రవేశపెట్టారు. దానిని ఈరోజు మెదక్ కలెక్టరేట్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్​ డాక్టర్లను పేషెంట్లను కలుపుతుందని... లాక్‌డౌన్‌ సమయంలో ఈ యాప్ ద్వారా ప్రజలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.


జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా... నలుగురు పూర్తిగా కోలుకున్నారని మెదక్​ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి తెలిపారు. వారిని డిశ్చార్జి చేయడం జరిగిందని.. ఇంకా ఒక వ్యక్తి త్వరలో కోలుకొని డిశ్చార్జ్ అవుతాడనిపేర్కొన్నారు. ఆరెంజ్ జోన్​ నుంచి గ్రీన్ జోన్​లోకి మెదక్ జిల్లా మారే అవకాశముందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బయటనుంచి వచ్చిన వ్యక్తులు గాని, ఇంకా ఇతర సమస్యలు ఉంటే కలెక్టరేట్​లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08452-223360కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.

ఇవీ చూడండి: గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.