ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి
నారాయణఖేడ్లో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కురిసింది. పట్టణ శివారులోని మన్సూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కంగ్టి, సిర్గాపూర్కు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్, బెజ్జంకిలోనూ భారీ వర్షం పడింది.
ఇదీ చదవండి: Covid-19: నాలుగో రోజూ లక్ష దిగువన కేసులు