ETV Bharat / state

యాచకులకు మున్సిపల్ సిబ్బంది సాయం - యాచకులకు మున్సిపల్ సిబ్బంది సాయం

యాచకులకు మంచిర్యాల మున్సిపల్ సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు.

FOOD DISTRIBUTION
FOOD DISTRIBUTION
author img

By

Published : May 21, 2021, 7:09 PM IST

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని యాచకులకు.. మున్సిపాలిటీ సిబ్బంది ఆహారం అందించి ఉదారతను చాటుకున్నారు. రెండోదశలో కొవిడ్ విజృంభిస్తున్న విపత్కర సమయంలో యాచకులు ఆహారం లేకుండా రైల్వే స్టేషన్​లో బిక్కుబిక్కుమంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు.

వారిని గుర్తించిన మున్సిపాలిటీ కమిషనర్​ స్వరూపారాణి తమ కార్యాలయ సిబ్బంది సహకారంతో 53వేల రూపాయలు జమ చేసి.. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు. లాక్​డౌన్​ వేళ ఆహారం లేక ఇబ్బందులకు గురవుతున్న వారికి స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారాలను అందించాలని కోరారు.

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని యాచకులకు.. మున్సిపాలిటీ సిబ్బంది ఆహారం అందించి ఉదారతను చాటుకున్నారు. రెండోదశలో కొవిడ్ విజృంభిస్తున్న విపత్కర సమయంలో యాచకులు ఆహారం లేకుండా రైల్వే స్టేషన్​లో బిక్కుబిక్కుమంటూ.. కాలం వెళ్లదీస్తున్నారు.

వారిని గుర్తించిన మున్సిపాలిటీ కమిషనర్​ స్వరూపారాణి తమ కార్యాలయ సిబ్బంది సహకారంతో 53వేల రూపాయలు జమ చేసి.. భిక్షాటన చేస్తూ బతికే వారికి పండ్లు, ఆహారాన్ని అందించారు. లాక్​డౌన్​ వేళ ఆహారం లేక ఇబ్బందులకు గురవుతున్న వారికి స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారాలను అందించాలని కోరారు.

ఇదీ చదవండి: సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.