ETV Bharat / state

కస్తూర్బా గాంధీ పాఠశాలకు పచ్చని హారం - greenary in kasturbha gandhi school in manchiryala

పచ్చదనం మనసును పులకరింపజేస్తుంది. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా.. చెట్టు కింద సేద తీరితే అదంతా దూరమవుతుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లు... మన అభివృద్ధికి మొక్కలు ఎంతో ఉపయోపడతాయి. ప్రకృతి మధ్య చదువులు కొనసాగిస్తే మరింత త్వరగా చదివింది ఒంటపడుతుంది. అందుకే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కస్తుర్బా గాంధీ పాఠశాలలో పచ్చని చెట్లు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుతున్నారు.

పచ్చని హారం
author img

By

Published : Sep 28, 2019, 8:02 PM IST

కస్తూర్బా గాంధీ పాఠశాలకు పచ్చని హారం

మంచిర్యాల జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల పచ్చదనాన్ని పరుచుకుంది. ఎటు చూసినా మొక్కలతో నిండి పోయింది. కస్తూర్బా పాఠశాలలో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల పుట్టిన రోజున మొక్కలు నాటుతారు. ఇప్పటి వరకు 600 రకాల మొక్కలు నాటారు. ప్రతి శనివారం ఇక్కడ విద్యార్థులు తోట పని చేస్తుంటారు. ఇటీవల ఆకుకూరలతోపాటు కూరగాయల సాగును ప్రారంభించారు.

మొక్కల దత్తత

పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలను దత్తత ఇచ్చారు. ఈ మొక్కలకు నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ఆ విద్యార్థులపై ఉంటుంది. పట్నం బంతి మొక్కలు పెరగడం వల్ల పాఠశాల కొత్త శోభను సంతరించుకుంది. ప్రకృతి అందాలను చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు మంత్ర ముగ్ధులవుతున్నారు.

మొక్కలకు తొట్లుగా

పాఠశాల వాడిన ఫినాయిల్ డబ్బాలు, తాగునీటి డబ్బాలను కత్తిరించి మొక్కలకు తొట్లుగా వినియోగిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు చురుకుగా గడ్డి తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్తరకం మొక్కలు ఏవి వచ్చినా.. ప్రత్యేక అధికారి చొరవ తీసుకుని విద్యార్థులతో నాటిస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే తోటమాలి భీమమ్మ మొక్కలపై చక్కని పాటలు పాడుతూ అలరింపజేస్తోంది. విద్యార్థులు కూడా ఈమె పాటలకు శ్రుతి కలుపుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చూడండి :హుజూర్​నగర్​లో వేడెక్కిన రాజకీయం...

కస్తూర్బా గాంధీ పాఠశాలకు పచ్చని హారం

మంచిర్యాల జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల పచ్చదనాన్ని పరుచుకుంది. ఎటు చూసినా మొక్కలతో నిండి పోయింది. కస్తూర్బా పాఠశాలలో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల పుట్టిన రోజున మొక్కలు నాటుతారు. ఇప్పటి వరకు 600 రకాల మొక్కలు నాటారు. ప్రతి శనివారం ఇక్కడ విద్యార్థులు తోట పని చేస్తుంటారు. ఇటీవల ఆకుకూరలతోపాటు కూరగాయల సాగును ప్రారంభించారు.

మొక్కల దత్తత

పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలను దత్తత ఇచ్చారు. ఈ మొక్కలకు నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ఆ విద్యార్థులపై ఉంటుంది. పట్నం బంతి మొక్కలు పెరగడం వల్ల పాఠశాల కొత్త శోభను సంతరించుకుంది. ప్రకృతి అందాలను చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు మంత్ర ముగ్ధులవుతున్నారు.

మొక్కలకు తొట్లుగా

పాఠశాల వాడిన ఫినాయిల్ డబ్బాలు, తాగునీటి డబ్బాలను కత్తిరించి మొక్కలకు తొట్లుగా వినియోగిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు చురుకుగా గడ్డి తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్తరకం మొక్కలు ఏవి వచ్చినా.. ప్రత్యేక అధికారి చొరవ తీసుకుని విద్యార్థులతో నాటిస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే తోటమాలి భీమమ్మ మొక్కలపై చక్కని పాటలు పాడుతూ అలరింపజేస్తోంది. విద్యార్థులు కూడా ఈమె పాటలకు శ్రుతి కలుపుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చూడండి :హుజూర్​నగర్​లో వేడెక్కిన రాజకీయం...

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_82a_20_pachani_kasturba_pkg_ts10030
పచ్చని కస్తూర్బా
....ఆహ్లాదకరంగా బెల్లంపల్లి కస్తూర్బా పాఠశాల
పచ్చని చెట్లు ఆరోగ్యాన్ని పంచడమే కాదు మనసును పులకరింప చేస్తాయి. తీవ్రమైన ఒత్తిడిలో ను చెట్టు సేద తీరితే అదంతా మటుమాయం అవుతుంది. చిన్నతనం నుంచే పచ్చని చెట్లను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ప్రకృతి మధ్య చదువులను కొనసాగిస్తే చదివిందంతా త్వరగా ఒంట పడుతుంది. చదివింది కూడా జ్ఞాపకం ఉంటుంది. పాఠశాల ప్రాంగణంతో పాటు పరిసరాలను పచ్చదనంతో నింపేసి కస్తూర్బా విద్యార్థులు స్ఫూర్తి గా నిలుస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో పరుచుకున్న పచ్చదనం పై ఈటీవీ భారత్ అందిస్తున్న స్ఫూర్తిదాయక కథనం
*పుట్టిన రోజున మొక్కలు
కస్తూర్బా పాఠశాలలో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల పుట్టిన రోజున మొక్కలు నాటుతారు. ఇలా నాటిన మొక్కలను వారే సంరక్షించు కుంటారు పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీవాణి ప్రత్యేక చొరవతో తన పుట్టిన రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి 600 రకాల మొక్కలను ఈ పాఠశాలలో నాటారు. ప్రతి శనివారం ఇక్కడ విద్యార్థులు తోట పని చేస్తుంటారు. ఇటీవల పాఠశాల లో ఆకుకూరలతో పాటు కూరగాయల సాగును ప్రారంభించారు. పుట్టినరోజుతో పాటు విజ్ఞానశాస్త్ర ఉద్యానవనాన్ని ఎంతో ఆసక్తిగా పెంచుతున్నారు.
* ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలు
పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలను దత్తత ఇచ్చారు. ఈ మొక్కలకు నీరు పోస్తు సంరక్షించాల్సిన బాధ్యత ఆ విద్యార్థులపై ఉంటుంది. ఇటీవల పాఠశాలలో రకరకాల పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. పట్నం బంతి మొక్కలు పెరగడంతో పాఠశాల కొత్త శోభను సంతరించుకుంది. ప్రకృతి అందాలను చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు మంత్ర ముగ్దులవుతున్నారు. ఇక్కడి వాతావరణాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆస్వాదిస్తున్నారు.
* వ్యర్థాల వినియోగం
పాఠశాల వాడిన ఫినాయిల్ డబ్బాలు, తాగునీటి డబ్బాలను కత్తిరించి మొక్కలకు తొట్లుగా వినియోగిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు చురుకుగా గడ్డి తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్తరకం మొక్కలు ఏవి వచ్చిన ప్రత్యేక అధికారి చొరవ తీసుకుని విద్యార్థులతో నాటిస్తున్నారు. పాఠశాల ఆవరణ విద్యార్థులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ పాఠశాలలో పనిచేసే తోటమాలి భీమామ్మ మొక్కలపై చక్కని పాటలు పాడుతూ అలరింప చేస్తుంది విద్యార్థులు కూడా ఈమె పాటలకు శ్రుతి కలుపుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.


Body:బైట్స్
1. కీర్తన, విద్యార్థిని
2. సబిత, విద్యార్థిని
3. శ్రీవాణి, ప్రత్యేక అధికారి.
4. భీమమ్మ, తోటమాలిని
5. కస్తూర్భా విద్యార్థుల మొక్క పాట
6. పీటుసి



Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.