ETV Bharat / state

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో దాదాపు 3 వేల మంది బాధ పడుతున్నారని... తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా సభ్యులు తెలిపారు. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా... జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Blood donation camp set up under the Telangana Jagriti in Mancherial district
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
author img

By

Published : Mar 13, 2021, 4:33 PM IST

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో... జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తగ్గుతున్న రక్త నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా జాగృతి సభ్యులు తెలిపారు.

Blood donation camp set up under the Telangana Jagriti in Mancherial district
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో దాదాపు 3 వేల మంది బాధ పడుతున్నారని అన్నారు. వారికి రక్తం అందించడం కోసం రక్త నిధి కేంద్రంలో నిల్వలు తగ్గకుండా ఉంచేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రిలోని రక్త నిధి కేంద్రానికి 100 యూనిట్ల రక్తాన్ని జాగృతి తరఫున అందించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నిబంధనలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు: సీసీఎంబీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో... జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తగ్గుతున్న రక్త నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా జాగృతి సభ్యులు తెలిపారు.

Blood donation camp set up under the Telangana Jagriti in Mancherial district
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో దాదాపు 3 వేల మంది బాధ పడుతున్నారని అన్నారు. వారికి రక్తం అందించడం కోసం రక్త నిధి కేంద్రంలో నిల్వలు తగ్గకుండా ఉంచేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రిలోని రక్త నిధి కేంద్రానికి 100 యూనిట్ల రక్తాన్ని జాగృతి తరఫున అందించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నిబంధనలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు: సీసీఎంబీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.