ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్ని ఇసుక లారీ... ఇద్దరు యువకుల మృతి

స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలో జరిగింది. చెన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా... కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

author img

By

Published : Jun 24, 2020, 8:01 PM IST

2 younger died in lorry accident in chennuru
ఇద్దరు యువకులను బలితీసుకున్న ఇసుక లారీ

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నూరుకు చెందిన సాయితేజ, పవన్​ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాయితేజ, పవన్​ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను పునరుద్ధరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నూరుకు చెందిన సాయితేజ, పవన్​ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాయితేజ, పవన్​ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను పునరుద్ధరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.