ETV Bharat / state

పాలమూరును గోదావరి జలాలతో తడుపుతాం: శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. కుంటలను, చెరువులను నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి సర్వ సభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

author img

By

Published : Jun 25, 2019, 8:14 PM IST

పాలమూరును గోదావరి జలాలతో తడుపుతాం

రాబోయే మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించి తీరుతామని లేని పక్షంలో ఓట్లడగమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పరిషత్‌ చివరి సర్వ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తయిందని నదుల అనుసంధానం ద్వారా జడ్చర్ల సమీపంలోని ఉద్దండపూర్‌ జలాశయంను గోదావరి జలాలతో నింపుతామని వెల్లడించారు. ఉమ్మడి జడ్పీటీసీ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ జడ్పీటీసీ సభ్యులను సన్మానించారు.

పాలమూరును గోదావరి జలాలతో తడుపుతాం: శ్రీనివాస్ గౌడ్


ఇవీచూడండి: 'అధికారం కోసం భాజపా చిత్ర విచిత్ర విన్యాసాలు'

రాబోయే మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించి తీరుతామని లేని పక్షంలో ఓట్లడగమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పరిషత్‌ చివరి సర్వ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తయిందని నదుల అనుసంధానం ద్వారా జడ్చర్ల సమీపంలోని ఉద్దండపూర్‌ జలాశయంను గోదావరి జలాలతో నింపుతామని వెల్లడించారు. ఉమ్మడి జడ్పీటీసీ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ జడ్పీటీసీ సభ్యులను సన్మానించారు.

పాలమూరును గోదావరి జలాలతో తడుపుతాం: శ్రీనివాస్ గౌడ్


ఇవీచూడండి: 'అధికారం కోసం భాజపా చిత్ర విచిత్ర విన్యాసాలు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.