ETV Bharat / state

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...?

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఉన్న రైల్వే లెవల్‌ క్రాసింగ్​ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ లెవల్‌ క్రాసింగుల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులతో వాహనదారులు, జనం నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలతో అనుసంధానం చేసే 167వ జాతీయ రహదారి దేవరకద్రలోని రైల్వే గేట్​తో తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొవటం నిత్యకృత్యంగా మారింది.

author img

By

Published : Jul 22, 2019, 5:33 PM IST

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...?

నిజాం కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కేంద్రానికి రహదారిని నిర్మించి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టం చేశారు. అనంతరం జరిగిన రైల్వే మార్గాల విస్తరణతో ఏర్పాటుచేసిన రైల్వే గేట్​పై ఆర్వోబీ నిర్మాణం జరగక స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...?

నిత్యం రద్దీగా...

నిత్యం దేవరకద్ర మీదుగా కాచిగూడ- కర్నూల్​ మధ్య సుమారు 45 రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఉదయం సమయంలోనే కనీసం 25 రైళ్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో కనీసం 10 నుంచి 40 నిమిషాలపాటు గేట్​ వేస్తుంటారు. ఈ రహదారిపై నిత్యం హైదరాబాద్ నుంచి కర్ణాటక లోని ప్రధాన పట్టణాలకు, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్ నుంచి నారాయణపేట , వనపర్తి , మహబూబ్ నగర్ జిల్లా వాసులు దేవరకద్ర మీదుగా వెళ్తుంటారు.

ఐదేళ్లుగా నిర్మాణాలు.. నిత్యం నరక యాతనలు

పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆర్​ఓబీ నిర్మాణానికి 2014లో శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వివిధ కారణాలతో చేపట్టిన పనులు ఆదిలోనే ఆగిపోయాయి. 2019లో తిరిగి ఆర్వోబీ నిర్మాణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు రూ.24 కోట్ల బడ్జెట్​తో ఇరువైపులా కిలోమీటర్ మేర రోడ్డు నిర్మాణం చేపట్టింది. అయితే పనులు ఆలస్యంగా సాగడం స్థానికులకు సమస్యగా మారాయి. వీలైనంత త్వరగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయాలని అప్పటి వరకు ప్రత్యేక సిబ్బందితో ట్రాఫిక్​క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీచూడండి: అంబారీపై... అమ్మవారు

నిజాం కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కేంద్రానికి రహదారిని నిర్మించి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను పటిష్టం చేశారు. అనంతరం జరిగిన రైల్వే మార్గాల విస్తరణతో ఏర్పాటుచేసిన రైల్వే గేట్​పై ఆర్వోబీ నిర్మాణం జరగక స్థానికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేవరకద్ర ఆర్వోబీకి మోక్షం ఎప్పుడు...?

నిత్యం రద్దీగా...

నిత్యం దేవరకద్ర మీదుగా కాచిగూడ- కర్నూల్​ మధ్య సుమారు 45 రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఉదయం సమయంలోనే కనీసం 25 రైళ్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో కనీసం 10 నుంచి 40 నిమిషాలపాటు గేట్​ వేస్తుంటారు. ఈ రహదారిపై నిత్యం హైదరాబాద్ నుంచి కర్ణాటక లోని ప్రధాన పట్టణాలకు, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్ నుంచి నారాయణపేట , వనపర్తి , మహబూబ్ నగర్ జిల్లా వాసులు దేవరకద్ర మీదుగా వెళ్తుంటారు.

ఐదేళ్లుగా నిర్మాణాలు.. నిత్యం నరక యాతనలు

పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆర్​ఓబీ నిర్మాణానికి 2014లో శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వివిధ కారణాలతో చేపట్టిన పనులు ఆదిలోనే ఆగిపోయాయి. 2019లో తిరిగి ఆర్వోబీ నిర్మాణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు రూ.24 కోట్ల బడ్జెట్​తో ఇరువైపులా కిలోమీటర్ మేర రోడ్డు నిర్మాణం చేపట్టింది. అయితే పనులు ఆలస్యంగా సాగడం స్థానికులకు సమస్యగా మారాయి. వీలైనంత త్వరగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయాలని అప్పటి వరకు ప్రత్యేక సిబ్బందితో ట్రాఫిక్​క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీచూడండి: అంబారీపై... అమ్మవారు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.