ETV Bharat / state

ముస్తాబవ్వాల్సినవి ... మూలనపడ్డాయి...

విజయదశమి రోజున దుర్గామాతను ఆరాధిస్తే చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తామని భక్తుల నమ్మకం. అందుకే దసరా పండుగ రోజున ఆయుధాలు, వస్తువులు, వాహనాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది ఆర్టీసీ సంస్థలో అన్ని డిపోలల్లో ఘనంగా నిర్వహించే దుర్గామాత పూజ ఈ ఏడాది సమ్మె కారణంగా జరగలేదు.

author img

By

Published : Oct 9, 2019, 2:38 PM IST

పూజకు నోచుకోని బస్సులు
పూజకు నోచుకోని బస్సులు

విజయదశమి రోజున బతుకుతెరువుకు తోడ్పడే పనిముట్లు, ఆయుధాలు, వాహనాలను దైవంగా భావించి వాటిని పూజించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆర్టీసీ సంస్థలోని అన్ని డిపోల్లో కార్మికులు, ఉద్యోగులు.. పనిముట్లు, ఆయుధాలకు పెద్ద ఎత్తున పూజలు చేసి బస్సులను అలంకరించేవారు. ఏడాది పాటు ఎలాంటి ప్రమాదం జరగకుండా దీవించమని దుర్గాదేవిని వేడుకునేవారు. ఈసారి సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పూజలు నిర్వహించలేదు.

పండుగకు దూరం

సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోలలో ఉన్న 10 వేల 400 బస్సులు ఈ ఏడాది పూజకు నోచుకోలేదు. సంస్థ మనుగడతో పాటు తాము సుఖసంతోషాలతో ఉండాలని విజయ దశమి రోజున పెద్ద ఎత్తున పూజలు నిర్వహించే వారమని సంఘాల నేతలు గుర్తు చేసుకున్నారు. మూడు రోజులపాటు కోలాహలంగా నిర్వహించే ఈ పండుగకు తామంతా దూరమయ్యామని ఆవేదన చెందారు.

బస్టాండ్​లో సేద తీరుతున్నాయ్

పండుగ పూట రంగు రంగుల కాగితాలు, పూలతో ముస్తాబై రోడ్లపై తిరగాల్సిన బస్సులు ఎలాంటి అలంకరణ లేకుండా బస్టాండుల్లో సేద తీరాయి.
పరిష్కారం చూపండి

సంస్థ మనుగడతో పాటు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా ఆర్టీసీ నేతలను చర్చలకు పిలిచి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

పూజకు నోచుకోని బస్సులు

విజయదశమి రోజున బతుకుతెరువుకు తోడ్పడే పనిముట్లు, ఆయుధాలు, వాహనాలను దైవంగా భావించి వాటిని పూజించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆర్టీసీ సంస్థలోని అన్ని డిపోల్లో కార్మికులు, ఉద్యోగులు.. పనిముట్లు, ఆయుధాలకు పెద్ద ఎత్తున పూజలు చేసి బస్సులను అలంకరించేవారు. ఏడాది పాటు ఎలాంటి ప్రమాదం జరగకుండా దీవించమని దుర్గాదేవిని వేడుకునేవారు. ఈసారి సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పూజలు నిర్వహించలేదు.

పండుగకు దూరం

సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోలలో ఉన్న 10 వేల 400 బస్సులు ఈ ఏడాది పూజకు నోచుకోలేదు. సంస్థ మనుగడతో పాటు తాము సుఖసంతోషాలతో ఉండాలని విజయ దశమి రోజున పెద్ద ఎత్తున పూజలు నిర్వహించే వారమని సంఘాల నేతలు గుర్తు చేసుకున్నారు. మూడు రోజులపాటు కోలాహలంగా నిర్వహించే ఈ పండుగకు తామంతా దూరమయ్యామని ఆవేదన చెందారు.

బస్టాండ్​లో సేద తీరుతున్నాయ్

పండుగ పూట రంగు రంగుల కాగితాలు, పూలతో ముస్తాబై రోడ్లపై తిరగాల్సిన బస్సులు ఎలాంటి అలంకరణ లేకుండా బస్టాండుల్లో సేద తీరాయి.
పరిష్కారం చూపండి

సంస్థ మనుగడతో పాటు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా ఆర్టీసీ నేతలను చర్చలకు పిలిచి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Intro:TG_Mbnr_06_08_Poojalaku_Nochukoni_RTC_Busses_PKG_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) మన బతుకుతెరువుకు తోడ్పడే పనిముట్లను, ఆయాదాలను, వాహనాలను దైవంగా భావించడం.. మన వృత్తిని గౌరవించుకోవడం ఆత్మాభిమానానికి సూచికలు. అయితే ఆర్టీసీ సంస్థలోని అన్ని డిపోలలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే దుర్గామాత పూజలను సమ్మె కారణంగా ఎక్కడా నిర్వహించకపోవడం శోచనీయం.


Body:విజయదశమి రోజున ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ తమ అవసరాలకు అనుగుణంగా వాహన, ఆయుధ, వస్తూ పూజలు నిర్వహిస్తారు. దుర్గామాతను ఆరాధిస్తూ పూజలు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తామని ఆయుధాలకు, వస్తువులకు, వాహనాలకు పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం. అందులో భాగంగా ఆర్టీసీ సంస్థలోని అన్ని డిపోల్లో కార్మికులు, ఉద్యోగులు పనిముట్లకు, ఆయాదాలకు పెద్ద ఎత్తున పూజలు చేయడంతో పాటు ఆర్టీసీ బస్సులను అలంకరించి ప్రతి ఏడాది పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. చేపట్టే ఏ వ్యాపారమైన విజయవంతంగా కొనసాగాలని,
వాహనాలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసేవారు.


Conclusion:ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఏ డిపోలో కూడా దుర్గాదేవి పూజలు నిర్వహించలేదని కార్మిక సంఘాల తెలిపాయి. సంస్థ మునగడతో పాటు తాము సుఖసంతోషాలతో ఉండాలని విజయ దశమినా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించే వారమని గుర్తు చేసుకున్నారు. మూడు రోజులపాటు కోలాహలంగా నిర్వహించే ఈ పండగకు తామంత దూరమవుతున్నందుకు బాద పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 బస్ డిపోలలో ఉన్న 10 వేల 400 బస్సులకు పూజలు చేయాల్సి ఉన్నా చేయలేకపోయామని సంఘాలు అభిప్రాయపడ్డాయి. సమ్మె సందర్భంగా రోడ్లపై తిరగాల్సిన అద్దె బస్సులు పూజలకు నోచుకోని బస్టాండ్ ఆవరణలో సేద తీరాయి....bytes
బైట్స్
కొండయ్య, రాష్ట్ర కార్యదర్శి టీఎంయూ.
భాను ప్రకాష్, ఐకాస నేత

Evo. సంస్థ మునగడతో పాటు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా ఆర్టీసీ నేతలను చర్చలకు పిలిచి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.