ETV Bharat / state

పునర్వైభవం సంతరించుకోనున్న హనుమద్దాసుల కోనేరు - పూనర్​వైభవం సంతరించుకోనున్న హనుమద్దాసుల కోనేరు...

పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కొండల మధ్య కొలువైన హనుమద్దాసుల కోనేరుకు  పూర్వ వైభవం రానుంది. 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కోనేరు కొంత కాలంగా శిథిలావస్థకు చేరుకుంది. ఓ దాత ముందుకొచ్చి కోనేటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునర్​నిర్మాణ పనులు చేపిస్తున్నారు.

RE CONSTRUCTION OF MANYAMKONDA TEMPLE IN MAHABOOBNAGAR
author img

By

Published : Nov 12, 2019, 1:36 PM IST

Updated : Nov 12, 2019, 3:37 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలోని మన్యంకొండలో కొలువైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో ప్రారంభం కానున్న వేళ... ఆలయం పూర్వవైభవం సంతరించుకుంటోంది. కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరిన కోనేరును... పునర్మించేందుకు ఓ దాత ముందుకొచ్చారు. కోనేటి చుట్టూ రాతిగోడ, శిథిలమైన మెట్లను నిర్మించారు. మరికొంత మంది దాతలు ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఆలయ చరిత్రలో ఒకటైన హనుమద్దాసుల వారి కోనేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 200 ఏళ్ల క్రితం మునుల కొండలో హనుమద్దాసు తపస్సు చేస్తూ... భక్తుల సౌకర్యార్థం కోనేటిని తవ్వించాడు. తవ్వించిన ఆ కోనేటిలో బండరాయి తప్ప నీటి చుక్క రాలేదు. వారం రోజుల పాటు ఒంటి కాలుపై కఠిన దీక్షతో హనుమద్దాసు తపస్సు చేయగా.. కోనేటిలోని బండ పగిలి గంగ ప్రవహించిందని పూర్వికుల కథనం.

పూనర్​వైభవం సంతరించుకోనున్న హనుమద్దాసుల కోనేరు...

ఇదీ చూడండి : కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం

మహబూబ్​నగర్ జిల్లాలోని మన్యంకొండలో కొలువైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో ప్రారంభం కానున్న వేళ... ఆలయం పూర్వవైభవం సంతరించుకుంటోంది. కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరిన కోనేరును... పునర్మించేందుకు ఓ దాత ముందుకొచ్చారు. కోనేటి చుట్టూ రాతిగోడ, శిథిలమైన మెట్లను నిర్మించారు. మరికొంత మంది దాతలు ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఆలయ చరిత్రలో ఒకటైన హనుమద్దాసుల వారి కోనేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 200 ఏళ్ల క్రితం మునుల కొండలో హనుమద్దాసు తపస్సు చేస్తూ... భక్తుల సౌకర్యార్థం కోనేటిని తవ్వించాడు. తవ్వించిన ఆ కోనేటిలో బండరాయి తప్ప నీటి చుక్క రాలేదు. వారం రోజుల పాటు ఒంటి కాలుపై కఠిన దీక్షతో హనుమద్దాసు తపస్సు చేయగా.. కోనేటిలోని బండ పగిలి గంగ ప్రవహించిందని పూర్వికుల కథనం.

పూనర్​వైభవం సంతరించుకోనున్న హనుమద్దాసుల కోనేరు...

ఇదీ చూడండి : కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం

Intro:TG_Mbnr_04_12_Koneruku_poorva_vyibhavam_VO_TS10094
పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కొండల మధ్య కొలువైన హనుమద్దాసు ల కోనేరుకు పూర్వ వైభవం రానుంది. రెండు వందల ఏళ్ల కిందట స్వామి భక్తుడైన హనుమద్దాసుల వారు భక్తుల సౌకర్యార్థం తవ్వించిన కోనేరు కొంతకాలంగా శిథిలావస్థలో ఉంది.



Body: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో నాడు మునుల కొండగా ప్రసిద్ధి చెందిన నేటి మన్యంకొండ లో లో కొలువైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మాఘ మాసం లో ప్రారంభం కానున్నాయి. ఆలయ చరిత్రలో ఒకటైన హనుమద్దాసుల వారి కోనేరు కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 200 సంవత్సరాల కిందట స్వామి భక్తుడిగా హనుమద్దాసులవారు మునుల కొండలో తపస్సు చేస్తూ భక్తుల సౌకర్యార్థం కోనేటిని తవ్వించాడు. తవ్వించిన ఆ కోనేటిలో బండరాయి తప్ప నీటి చుక్క రాలేదని. అంతటితో హనుమద్దాసుల వారు వారం రోజుల పాటు ఒంటి కాలు పై కఠిన దీక్ష తో తపస్సు చేయగా.. కోనేటి లో ఉన్న బండ రాయి పగిలి గంగ ప్రవహించిందని పూర్వికుల కథనం. అలా నిర్మించిన ఆ కోనేరు కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరింది. తిరిగి ఆ కోనేటికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఓ దాత ముందుకొచ్చారు. కోనేటి చుట్టూ రాతి గోడను, శిథిలమైన మెట్లను పురాతన కోనేరు ఆకారంలోనే సరి చేస్తూ నిర్మించారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి కోనేరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Conclusion: మరో రెండు నెలల్లో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి దాతల సహకారంతో మన్యంకొండ లోని హనుమద్దాసు వారి కోనేరుకు పూర్వవైభవం రావడం విశేషం.
స్ట్రింగర్
ఎన్ శివప్రసాద్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర
8008 573 853
Last Updated : Nov 12, 2019, 3:37 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.