![](https://assets.eenadu.net/article_img/27Stories-4a.jpg)
చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి పేరు మహ్మద్ అఫమ్. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం షేక్పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో టీవీ లేదు. ఉన్న స్మార్ట్ఫోన్ ఒక్కటే ఆన్లైన్ పాఠాలకు ఆధారం. కానీ, ఆ గ్రామంలో సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా అందవు. దీంతో గ్రామ శివారులో జొన్నచేనులో కాస్త ఎత్తులో ఏర్పాటు చేసిన మంచెపై కూర్చుని ఇలా పాఠాలు వింటున్నాడు.