రాష్ట్రంలో రైతుల సమస్యలపై పాలమూరు విశ్వవిద్యాలయంలో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి రాజారత్నం తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను ఏ విధంగా అభివృద్ధి చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందో అనే అంశంపై చర్చించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపడుతున్న పురోగతి, రైతుబంధు, రైతు బీమా వంటి 12 అంశాలపై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 90 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరందరూ మూడు దఫాలుగా జరిగే చర్చలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అంద చేయనున్నట్టు వివరించారు.
ఇవీ చూడండి: జనావాసాల మధ్య పిడుగు..ప్రజల పరుగు