ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న లక్ష్యమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈరోజు పాలమూరు పట్టణంతో పాటు హన్వాడ మండలం వరకు నీటి కాలువ నిర్మించే ప్రతిపాదిత ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులతో కలిసి సందర్శించారు. కర్వెన జలాశయం నుంచి మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న భూములకు సాగునీరందించే విధంగా ప్రణాళికలను రూపొందించామని... అందుకనుగుణంగా సర్వే కూడా పూర్తయిందని తెలిపారు. ఈ పాటికే ప్రాజెక్ట్ పనులు పూర్తి కావాల్సి ఉండగా... కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. కొందరు ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదిఎమైనా పాలమూరు-రంగారెడ్డి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు