ETV Bharat / state

అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం - kurumoorthy jathara news

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదక్షిణ తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

వైభవంగా ఉద్దాల ఉత్సవం
author img

By

Published : Nov 4, 2019, 12:22 AM IST

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భారీ భద్రత నడుమ ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం పల్లమర్రి నుంచి ఉద్దాల చాటను ఊరేగింపుగా వడ్డెమాన్​కు తీసుకొచ్చారు. వడ్డెమాన్​లో గంటపాటు ఉద్దాల దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ అప్పంపల్లి, తిరుమలపూర్ మీదుగా కురుమూర్తి ఆలయానికి స్వామివారి ఉద్దాలు చేరుకున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి సమర్పించారు. వడ్డెమాన్ నుంచి కురుమూర్తి వరకు జరిగిన ఊరేగింపులో భారీ ఎత్తున భక్తజనం పాల్గొని పాదుకలను దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద జరిగిన ఉద్దాల ప్రదక్షిణ తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పాదుకలను తాకేందుకు పోటీపడ్డారు. జాతర మొత్తంలో స్వామి వారి ఉద్దాలను దర్శించడం, తాకడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

వైభవంగా ఉద్దాల ఉత్సవం

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. భారీ భద్రత నడుమ ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం పల్లమర్రి నుంచి ఉద్దాల చాటను ఊరేగింపుగా వడ్డెమాన్​కు తీసుకొచ్చారు. వడ్డెమాన్​లో గంటపాటు ఉద్దాల దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ అప్పంపల్లి, తిరుమలపూర్ మీదుగా కురుమూర్తి ఆలయానికి స్వామివారి ఉద్దాలు చేరుకున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి సమర్పించారు. వడ్డెమాన్ నుంచి కురుమూర్తి వరకు జరిగిన ఊరేగింపులో భారీ ఎత్తున భక్తజనం పాల్గొని పాదుకలను దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద జరిగిన ఉద్దాల ప్రదక్షిణ తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పాదుకలను తాకేందుకు పోటీపడ్డారు. జాతర మొత్తంలో స్వామి వారి ఉద్దాలను దర్శించడం, తాకడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

వైభవంగా ఉద్దాల ఉత్సవం

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

Tg_mbnr_09_03_kurumurty_jathara_avb_3068847 రిపోర్టర్ స్వామికిరన్ ..... మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగ సాగుతోంది. భారీ భద్రత నడుమ ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామం నుంచి ఉద్దాల చాట ను ఊరేగింపుగా వడ్డేమాన్ కు తీసుకు వచ్చారు. వడ్డేమాన్ లో గంటపాటు ఉద్దాల దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ అప్పంపల్లి ,తిరుమల పూర్ మీదుగా కురుమూర్తి ఆలయానికి స్వామివారి ఉద్దాలు చేరుకున్నాయి.. మంత్రి శ్రీ నివాస్ గౌడ్, ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి సమర్పించారు. వడ్డెమాన్ నుంచి కురుమూర్తి వరకు జరిగిన పాదుకల ఊరేగింపు భారీ ఎత్తున భక్తజనం పాల్గొని పాదుకలను దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద జరిగిన ఉద్దాల ప్రదక్షిణ తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పాదుకలను తాకేందుకు పోటీపడ్డారు.జాతర మొత్తం లో స్వామి వారి ఉద్దాలను దర్శించడం , తాకడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వశిస్తారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.