ETV Bharat / state

ఉద్యాన పంటల సాగుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి సిట్రస్ జాతి పండ్ల తోటల సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ చేయూతనిస్తోంది. పలు జిల్లాల్లో పండ్ల తోటల సాగు వైపు అన్నదాతలు మొగ్గు చూపిస్తున్నారు. బత్తాయి సాగులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా కిన్నో ఆరెంజ్ మాండరిన్‌ సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల్లో కొందరు రైతులు కిన్నో ఆరెంజ్, బత్తాయి, నిమ్మ పంటలు సాగు చేస్తూ చక్కటి సత్ఫలితాలు సాధిస్తున్నారు.

author img

By

Published : Jul 17, 2020, 4:37 PM IST

ఉద్యాన పంటల సాగుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి
ఉద్యాన పంటల సాగుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి
ఉద్యాన పంటల సాగుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం వల్ల సాగు రంగానికి మంచి రోజులు వస్తున్నాయి. ఉద్యాన పంటలకు పెద్దపీట వేసిన సర్కారు పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగుకు భారీగా ఇస్తున్న రాయితీలను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కరోనా వైరస్‌ విస్తృతితో రోగనిరోధక శక్తిని పెంపొందించే సిట్రస్ జాతి పండ్లతోపాటు ఇతర రకాల పౌష్టికాహార వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దక్కన్ పీఠభూమి కావడం, అనుకూల వాతావరణం, నేలలు, ఇతర సాగు నీటి వనరుల సానుకూలతలతో రైతులు పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో పండ్ల తోటల సాగుతో అధికాదాయం పొందుతున్నారు.

కొందరు ఔత్సాహిక రైతులు పంజాబ్‌ నుంచి విత్తనాలు తీసుకొచ్చి కిన్నో ఆరెంజ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌, గిరాకీ ఉన్న కిన్నో సాగుతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. కొత్త బత్తాయి రకంగా గుర్తింపు పొందిన కిన్నో ఆరేంజ్‌ తోటల్లో మంగు, నల్లి, వేరుకుళ్లు వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. కొన్ని క్షేత్రాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న దృష్ట్యా కొంత చీడపీడలు, తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్‌ ఇబ్బందులుంటున్నాయి.

కిన్నో ఆరెంజ్‌ సాగుకు ఎర్రనేలలు అత్యంత అనుకూలం. ఈ పంటకు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో షేర్‌పల్లి, భూత్పూర్, మక్తల్, ఆత్మకూరు, గద్వాల్‌, మల్దకల్, అయిజ ప్రాంతాల రైతులు దాదాపు 25 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తూ అధిగ దిగుబడులు, లాభాలు అర్జిస్తున్నారు. కినో ఆరెంజ్ పండ్ల రసం నెల రోజుల వరకు రుచిలో మార్పు ఉండదు. బత్తాయి పులుపు, తీపి కలిపిన రుచితో ఉంటే... కిన్నో ఆరెంజ్‌ పూర్తి తియ్యగా ఉంటుంది. పండ్ల తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తున్న దృష్ట్యా తగిన నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.

కిన్నో ఆరెంజ్‌ సాగు విస్తీర్ణం దశల వారీగా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లోనూ పెంచేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది.

ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ఉద్యాన పంటల సాగుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం వల్ల సాగు రంగానికి మంచి రోజులు వస్తున్నాయి. ఉద్యాన పంటలకు పెద్దపీట వేసిన సర్కారు పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగుకు భారీగా ఇస్తున్న రాయితీలను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కరోనా వైరస్‌ విస్తృతితో రోగనిరోధక శక్తిని పెంపొందించే సిట్రస్ జాతి పండ్లతోపాటు ఇతర రకాల పౌష్టికాహార వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దక్కన్ పీఠభూమి కావడం, అనుకూల వాతావరణం, నేలలు, ఇతర సాగు నీటి వనరుల సానుకూలతలతో రైతులు పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో పండ్ల తోటల సాగుతో అధికాదాయం పొందుతున్నారు.

కొందరు ఔత్సాహిక రైతులు పంజాబ్‌ నుంచి విత్తనాలు తీసుకొచ్చి కిన్నో ఆరెంజ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌, గిరాకీ ఉన్న కిన్నో సాగుతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. కొత్త బత్తాయి రకంగా గుర్తింపు పొందిన కిన్నో ఆరేంజ్‌ తోటల్లో మంగు, నల్లి, వేరుకుళ్లు వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. కొన్ని క్షేత్రాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న దృష్ట్యా కొంత చీడపీడలు, తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్‌ ఇబ్బందులుంటున్నాయి.

కిన్నో ఆరెంజ్‌ సాగుకు ఎర్రనేలలు అత్యంత అనుకూలం. ఈ పంటకు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో షేర్‌పల్లి, భూత్పూర్, మక్తల్, ఆత్మకూరు, గద్వాల్‌, మల్దకల్, అయిజ ప్రాంతాల రైతులు దాదాపు 25 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తూ అధిగ దిగుబడులు, లాభాలు అర్జిస్తున్నారు. కినో ఆరెంజ్ పండ్ల రసం నెల రోజుల వరకు రుచిలో మార్పు ఉండదు. బత్తాయి పులుపు, తీపి కలిపిన రుచితో ఉంటే... కిన్నో ఆరెంజ్‌ పూర్తి తియ్యగా ఉంటుంది. పండ్ల తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తున్న దృష్ట్యా తగిన నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.

కిన్నో ఆరెంజ్‌ సాగు విస్తీర్ణం దశల వారీగా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లోనూ పెంచేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది.

ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్‌ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.