మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం ముత్యాలంపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గానుగ నూనె కేంద్రాన్ని డీఆర్డీఏ పీడీ క్రాంతి ప్రారంభించారు. గ్రామంలోని సూర్య భీమేశ్వరి మహిళా సమాఖ్య ఒక గ్రూపుగా ఏర్పడి కల్తీ లేని, పరిశుద్ధమైన నూనెను సహజ పద్ధతిలో గానుగ ద్వారా తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లభిస్తున్న నూనెల్లో కల్తీ కలవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు. కాబట్టి ఈ విధంగా స్వచ్ఛమైన నూనె తయారు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చన్నారు.
ఇవీ చూడండి: ట్రాన్స్కో డీఈల అవినీతి బాగోతం...